సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ సమంత. అలాంటి సమంత కాల్షీట్స్ ని సంపాదించాలంటే సాధారణ నిర్మాణతలకు, అలాగే సాధారణ హీరోలకు సాధ్యం కాని పని. అయితే ప్రస్తుతం కాలంలో బడా హీరోలకు, బడా నిర్మాతలకు సైతం సమంత అంత త్వరగా కాల్షీట్స్ ని ఇవ్వటం లేదంట. ముఖ్యంగా టాలీవుడ్ కి చెందిన చాలా మంది ప్రముఖలను సమంత పక్కన పెట్టినట్ట తెలుస్తుంది.

తనని మరింత ఫోర్స్ చేస్తే, కోలీవుడ్ ప్రాజెక్ట్స్ లో బిజిగా ఉన్నాను. తర్వాత ఆలోచిద్దాం..అంటూ తెలివిగా తప్పుకోవటం మొదలు పెట్టింది. గతంలోనూ దిల్ రాజుకి సమంత ఇలాంటి ఝలక్స్ చాలానే ఇచ్చింది. అయితే తాజాగా దిల్ రాజు తెలిగా వ్యవహరించి, తన అప్ కమింగ్ ప్రొడక్షన్ లో సమంతని హీరోయిన్ గా బుక్ చేశాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, మళయాలంలో ఘన విజయం సాధించిన ‘బెంగళూరు డేస్’ అనే సినిమా తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ కానున్న విషయం తెలిసిందే.

తమిళంలో ఈ సినిమాను పీవీపీ సంస్థ నిర్మిస్తుండగా, తెలుగులో దిల్‌రాజు నిర్మించనున్నారు. ఇప్పటికే తమిళ రీమేక్ కి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక త్వరలోనే తెలుగు రిమేక్స్ స్టార్ట్ కావాల్సి ఉంది. 

తమిళ రీమేక్‌లో ఆర్య, రానా, బాబీ సింహా, శ్రీ దివ్యలు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు.మళయాలంలో నిత్యామీనన్ పోషించిన అతిథి పాత్రను సమంత చేస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఆమెను సంప్రదించారట. ఇక ఈ సినిమాలో నటించేందుకు సమంత కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సమంతని ఈ పాత్రకి ఒప్పించటానికే..దిల్ రాజు చాలా కష్టపడాల్సి వచ్చినట్టుగా చిత్ర వర్గాల్లో టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: