ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాహుబలి మూవీ క్రియేట్ చేస్తున్న రికార్డ్స్ పై ఎంత ఆసక్తి ఉందో, అంత కంటే చిరంజీవి 150వ సినిమా పైన సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, పూరీ జగన్నాధ్ కి తండ్రికొడుకులు డైలమాలో పడేసారనే టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, మెగా అభిమానులతో పాటు, సాధారణ తెలుగు సినీ ప్రేక్షకుడు సైతం చిరంజీవి 150వ సినిమా కోసం ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నాడు.

కానీ, ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన క్లారిటీ వచ్చినా, ఎందుకో ఇంకా చిత్ర వర్గాల్లో అనుమానాలు రేకెత్తిస్తూనే ఉన్నాయి. మొదట, చిరు 150వ సినిమా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేయనున్నాడని తెలియడంతో ఈ సినిమా వార్తల్లో నిలిచి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అనౌన్స్ చేసిన కొద్ది రోజుల పాటు మీడియాలో హాట్ టాపిక్ గా హల్ చల్ చేసిన ఈ సినిమా ఆ తర్వాత సైలంట్ అయిపోయింది. 

పూరీని చిరు మార్చేయబోతున్నాడంటూ, పూరీ కథలో భారీ మార్పులని చిరు సూచించినట్టు, అస్సలు పూరీని ఏకంగా మార్చేయబోతున్నట్టు ఇంకా హాట్ టాక్స్ వినిపిస్తూనే ఉన్నాయి. పూరి జగన్నాధ్ ఫస్ట్ హాఫ్ మొత్తం చెప్పానని అది చిరుకి చాలా బాగా నచ్చిందని,త్వరలోనే సెకండాఫ్ చెప్తానని కొద్ది రోజుల క్రితం తెలిపాడు. అయితే సెకండాఫ్ ని వినటానికి పూరీ చిరు కాని, రామ్ చరణ్ కాని టైం ఇవ్వటం లేదంట.

ఇందుకు ఇలా జరుగుతుందో పూరీ అస్సలు అర్ధం కావడం లేదు. ఈలోపు వరుణ్ తేజ్ ‘లోఫర్’ సినిమా షూటింగ్ లో పూరీ బిజీ అయిపోయాడు. అలాగే చిరు బర్త్ డే కానుకగా ఆగష్టు 22న 150వ సినిమాని లాంచ్ చేయాలి అనుకున్నారు. కానీ లాంచ్ టైం దగ్గర పడుతున్నా అటు పూరి,ఇటు చరణ్ సినిమాపై సరైన క్లారిటీ ఇవ్వకపోవడంతో మెగా అభిమానుల్లో సస్పెన్స్ పెరిగిపోతోంది. మొత్తంగా చిరు 150వ సినిమా, పూరీ చేతి నుండి జారిపోయే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయనే టాక్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: