రెజీనా తరువాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ లాంటి హీరోయిన్స్ టాప్ హీరోలందరినీ చుట్టేస్తూ కోట్ల పై పారితోషికాలను పుచ్చుకుంటూ ఉంటే డస్కీ బ్యూటీ రెజీనా మాత్రం ఈ రేస్ లో చాల వెనకపడిపోయింది. దీనితో ఇక లాభం లేదని అనుకుని కాబోలు ఒక హాట్ ఫోటో షూట్ లో తన గ్లామర్ ను ఒలక పోస్తూ పోజులు ఇవ్వడమే కాకుండా ఆ ఫోటోలను తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసి మీడియాకు కూడ రిలీజ్ చేసింది. 

ఈ ఫోటోలను చూసిన చాలామంది దర్శక నిర్మాతలు రెజీనాలో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోతూ ఉండటంతో ఇప్పుడు ఈ ఫోటో షూట్ వ్యవహారం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ లో నటిస్తున్న రెజీనాకు ఈ లేటెస్ట్ ఫోటో షూట్ ఏకంగా ముగ్గురు హీరోలతో ఆఫర్లు తెచ్చి పెట్టిందని వార్తలు వస్తున్నాయి.

ఈ ఫోటో షూట్ తో రెజీనా గోపీచంద్ మంచు విష్ణు మనోజ్ ల దృష్టిని ఆకర్షించి వరస ఆఫర్లను కొట్టేసిందని టాక్. సామాన్యంగా ఇటువంటి హాట్ ఫోటో షూట్స్ ‘మ్యాగ్జిమ్’ లాంటి హాట్ మ్యాగజైన్ల కోసం హీరోయిన్స్ ఇస్తూ ఉంటారు. కానీ పత్రికలతో సంబంధం లేకుండా తనకు తానే ఒక ఫోటో షూట్ ను ఏర్పాటు చేసుకుని ఆ ఫోటోలను మీడియాకు వదిలి ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది రెజీనా..

ఈమధ్య టాలీవుడ్ లో ఒక యంగ్ హీరోతో చాల సన్నిహితంగా ఉంటూ సంచలనాలు చేస్తోంది అంటూ ఈమె పై వార్తలు వచ్చిన నేపధ్యంలో తన హాట్ లుక్స్ ను మరింత ఎక్స్ పోజ్ చేస్తూ రెజీనా ఇచ్చిన ఈ ఫోటో షూట్ ఆమెను టాప్ హీరోయిన్ గా ఎంతవరకు మార్చగలుగుతుందో చూడాలి.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: