అక్కినేని అఖిల్ వినాయక్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ ఇంచుమించు చివరకు రావడంతో అఖిల్ నటించబోయే రెండవ సినిమా గురించి ఫిలింనగర్ లో అప్పుడే చర్చలు మొదలు అయిపోయాయి.ఈ మధ్యన దర్శకుడు శ్రీనువైట్ల నాగార్జునను కలిసి అఖిల్ రెండవ సినిమాకు సంబంధించి ఒక స్టొరీ లైన్ చెప్పాడని ఆస్టొరీ లైన్ నాగ్ కు బాగా నచ్చడంతో అఖిల్ రెండవ సినిమాను శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తాడని అంటూ వార్తలు కూడ వచ్చాయి.

అయితే లేటెస్ట్ గా అఖిల్ రెండవ సినిమాకు సంబంధించిన వార్తలలో రాజమౌళి కొడుకు కార్తికేయ పేరు రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఫిలింనగర్ వినపడుతున్న వార్తల ప్రకారం తండ్రికి తగ్గ వారసుడిగా దర్శకుడి అవతారంలో కనిపిస్తాడు అనుకున్న కార్తికేయ త్వరలో భారీ సినిమాల నిర్మాతగా మారబోతున్నాడని టాక్. 

ఈ విషయాలకు మరింత బలం చేకూరుస్తూ ఈమధ్య కార్తికేయ అఖిల్ ను కలిసి తానూ నిర్మించబోయే మొట్టమొదటి సినిమాలో హీరో గా నటించమని అఖిల్ ను కోరడం దానికి అఖిల్ అంగీకరించడం జరిగిపోయాయని ఫిలింనగర్ టాక్. అయితే అఖిల్ హీరోగా తన తొలి సినిమాలో నటించే ముందు కార్తికేయ దర్శకత్వంలో షార్ట్ ఫిలిమ్స్ లో నటించి తన నటనకు తుది మెరుగులు దిద్దుకున్నాడు. అప్పటినుంచి వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది అన్నవార్తలు ఉన్నాయి.

కార్తికీయ నిర్మాతగా మారడానికి తన తండ్రి రాజమౌళి అంగీకారం ఇప్పటికే లభించింది అన్న వార్తలు వస్తున్న నేపధ్యంలో ఈవిషయమై నాగార్జున అంగీకారం కూడా లభిస్తే అఖిల్ నటించబోయే రెండవ సినిమాకు నిర్మాతగా కార్తికేయ మారడం ఖాయం అని అంటున్నారు. అయితే ఈ క్రేజి ప్రాజెక్ట్ కు ఎవరు దర్శకుడు అన్నది ఇప్పటికి సస్పెన్సు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈసినిమా వచ్చేసంవతరం ప్రారంభంలో షూటింగ్ కోసం పట్టాలు ఎక్కుతుంది అంటున్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: