వన్ మూవీ, ఆగడు మూవీ లాంటి భారీ ఎక్స్ పెక్టేషన్స్ వచ్చిన మూవీలు రెండూ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడంతో మహేష్ బాబు, తరువాతి ఫిల్మ్స్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. బహు జాగ్రత్తలను తీసుకొని..తను నటించిన మూవీ శ్రీమంతుడు ఈ మూవీ సక్సెస్ అనేది దర్శకుడికి ఎంత ముఖ్యమో...మహేష్ కి సైతం అంతే ముఖ్యంగా కనిపిస్తుంది.

అందుకే ప్రమోషన్స్  దగ్గర నుండి మూవీ రిలీజ్ వరకూ ఎటువంటి హైప్ క్రియేట్ చేయాలో...ఆ విధమైన అన్ని రకాల ప్రయత్నాలు మహేష్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుంది అంటే అభిమానులకు అదొక పండుగ. అలా అభిమానులు పండుగ చేసుకోవడానికి అతి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఎందుకంటే మహేష్ నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్‘శ్రీమంతుడు’ సినిమా ఆగష్టు 7న ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేష్ బాబు సినిమాలకు లోకల్ లోనే కాదు యుఎస్ లో కూడా ఫుల్ క్రేజ్ ఉంటుంది.

మహేష్ అన్ని సినిమాలు యుఎస్ లో భారీగా రిలీజ్ అవుతుంటాయి. శ్రీమంతుడు సినిమా కూడా సుమారు 150పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే ఓవర్సీస్ లో శ్రీమంతుడు మొదటి 10 టికెట్ల సెల్ తోనే సూపర్బ్ అమౌంట్ ని కలెక్ట్ చేసింది. డెట్రాయిట్ లో మొదటి 10టికెట్లని 15 వేల డాలర్స్ కి కొనుగోలు చేసి ఓవర్సీస్ లో కలెక్షన్స్ ని స్టార్ చేసారు. అలాగే ఓపెనింగ్ డే కి సాధారణ సినీ ప్రేక్షకుడికి టికెట్ దొరకనంతగా బుకింగ్స్ జరగాలని, ఇదే తరహా మొదటి మూడు రోజులు డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు చేయగలిగితే పది రోజుల్లో మూవీ ప్రాఫిట్ లోకి వెళుతుంది.

ఇక మూవీ కచ్ఛితంగా హిట్ సాధిస్తుందనే కాన్ఫిడెంట్ లో మహేష్ ఉన్నాడు. అందుకే బిజినెస్ పై ప్రత్యేక ద్రుష్టి పెట్టాడు. మూవీ బిజినెస్ థియోటర్స్ వద్ద ఏ విధంగా పెంచాలి? అలాగే థియోటర్స్ వద్ద మూవీకి ఏ విధమైన హైప్ క్రియేట్ చేయాలి? అనే దానిపై మహేష్ టీం ప్రత్యేకంగా కసర్తులు చేస్తుంది. మొత్తంగా మహేష్ బాబు...తను నటించిన శ్రీమంతుడు మూవీ ఒపెనింగ్ కలెక్షన్స్ రికార్డ్స్ క్రియేట్ చేయగలిగే విధంగా ప్లానింగ్స్ చేసుకుంటున్నాడంటూ ఫిల్మ్ నగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: