వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కింగ్ నాగార్జున, తమిళ హీరో కార్తి కలసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషలలో ఏకకాలంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ భారి బడ్జెట్ సినిమాను పివిపి సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా ఒకేసారి నాగార్జున, కార్తి లతో రొమాన్స్ చేస్తుంది.
అయితే చిత్రయూనిట్ నుండి అందిన సమాచారం ప్రకారం తమన్న, నాగార్జునకి ఝలక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, తెలుగులో నాగార్జున సరసన తమన్నా ఇప్పటివరకు నటించలేదు. కాని, కార్తి – తమన్నాలు తమిళంలో హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘పైయ్యా’ (తెలుగులో ‘అవారా’గా విడుదలయింది), ‘సిరుత్తై’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి.
దీంతో నాగార్జున కంటే తమన్న, కార్తి దగ్గరే కంఫర్ట్ గా ఫీలవుతుందట. ముఖ్యంగా నాగార్జున, కార్తిల కి సంబంధించిన సీన్స్ లో తమన్న షూటింగ్ గ్యాప్ లో ఎక్కువుగా కార్తితో ముచ్చటిస్తుందట. దీంతో నాగార్జున కొద్దిగా ఫీల్ అయినట్టుగా ఉంటున్నాడని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ సినిమా తాజాగా యూరప్లో మొదలైన భారీ షెడ్యూల్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.
పారిస్ పరిసరాల్లో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. నాగార్జున, తమన్నా, కార్తీలు పాల్గొంటుండగా పలు సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అంతే కాకుండా, ఈఫిల్ టవర్ ప్రాంతంలో దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి ఈ ముగ్గురూ ఫోటోలకు ఫోజులిచ్చి, మీడియాకు అప్ డేట్స్ ని ఇస్తున్నారు.