మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి అనుకున్న స్థాయిలో మెప్పించలేక పోయింది. మనిషి విలువలకు.. తండ్రి గొప్పతనాన్ని కాపడటం కోసం కోడుకు పడే తాపత్రయం ఈ సినిమాల అద్భుతంగా చూపించాడు త్రివిక్రమ్. సెంటిమెంట్ బాగానే వర్క్ అవుట్ అయినా సినిమా మాత్రం కమర్షియల్ గా రాణించలేక పోయింది. ఇక ఈ సినిమా తర్వాత బన్ని కాస్త ఆచీ..తూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.

అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ చిత్రం మొదలయ్యి రెగ్యులర్ షూటింగ్ జూలై 29 నుంచీ జరుగుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ‘సరైనోడు’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉందని సమాచారం. ఈ మేరకు రిజిస్టర్ చేస్తున్నట్లు, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది.  ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో విలన్ ఎంపిక పూర్తైందని తెలుస్తోంది. ఆ పాత్రలో కనిపించేది మరెవరో కాదు…గతంలో ఒక విచిత్రం, గుండెల్లో గోదారి చిత్రాల్లో హీరోగా కనిపించిన ఆది పినిశెట్టి అని సమాచారం. 


సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో అల్లు అర్జున్


పక్కా అవుట్‌ అండ్‌ అవుట్‌ హీరోయిజం ఉన్న స్టోరీ తో బన్ని రాబోతున్నాడట. లవ్‌ స్టోరీ కూడా మిళితమై ఉంటుంది. కొత్త బన్ని కనిపిస్తారు. ఈ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తాను” అని తెలిపారు. అల్లు అర్జున్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ సంస్థలో ఓ సినిమా రూపొందనుంది.థమన్‌.ఎస్‌.ఎస్‌. ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., మాటలు: ఎం.రత్నం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయపాటి శీను.


మరింత సమాచారం తెలుసుకోండి: