బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన క్రేజీ హీరోయిన్ ఇప్పుడు సౌత్ సినిమాల్లో కూడా నటించడానికి రెడీ అయ్యిందట. ధనుష్ నిర్మించిన కాక్క‌ సెట్టై సినిమా దర్శకుడు దొరై సెంథిల్ కుమార్ తో ధ‌నుష్ చేయ‌బోయే త‌ర్వాతి సినిమాలో విద్యాబాల‌న్ ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తుంద‌ని స‌మాచారం. పొలిటికల్ బ్యాక్ డ్రాప్తో వస్తున్న ఈ సినిమాలో ధనుష్ డ్యుయల్ రోల్లో కనిపించన్నున్నాడట. ఇక ఇందులో ఓ ఇంపార్టెంట్ క్యారక్టర్ కోసం బాలీవుడ్ హాట్ హీరోయిన్ విద్యాబాల‌న్ ను సంప్ర‌దించారట ద‌ర్శ‌క‌నిర్మాత‌లు.

 

విద్య కూడా ఈ ఆఫర్ పట్ల పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యిందట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విద్య ఈ సినిమాలో విలన్ రోల్ ప్లే చేస్తుందని కోలీవుడ్ హాట్ న్యూస్. సినిమాలో ఒక పర్ఫర్ఫుల్ క్యారక్టర్లో విద్య కనిపించనున్నదట. అయితే ఆ క్యారక్టర్ సినిమాలో చాలా కీలకం కాబట్టే డర్టీ హీరోయిన్ ను తీసుకుందామనే ఆలోచన వచ్చిందట దర్శక నిర్మాతలకు.  రీసెంట్ గా మారి సినిమాతో అలరించిన ధనుష్ ప్ర‌స్తుతం ధనుష్ ప్ర‌భుసాల్మాన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

 

మారి సినిమాలో ధనుష్ :

 

అది పూర్తికాగానే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. రాంజానా విజ‌యంతో బాలీవుడ్ లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు ధ‌నుష్. ఇక అమితాబ్ తో నటించిన షమితాబ్ కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విద్యాబాల‌న్ కు ఎలాగూ అక్క‌డ సూప‌ర్ ఇమేజ్ ఉండ‌నే ఉంది.

 

ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న సినిమా కావ‌డంతో.. అటు కోలీవుడ్ తో పాటు బాలీవుడ్లో కూడా ఈ సినిమాపై ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. మరి మొదటిసారిగా సౌత్ సినిమాలో నటిస్తున్న విద్యబాలన్ కు మన ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్ ఇస్తారో వేచి చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: