చెన్నైలో అలీవ్ బీచ్ లో కల ఒక గెస్ట్ హౌస్ లో టాప్ హీరో హీరోయిన్స్ చేసిన హంగామాకు సంబంధించిన ఫోటోలు  మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. 1980 ప్రాంతంలో దక్షిణాది సినిమా రంగాన్ని గ్లామర్ బ్యూటీలుగా ఏలిన హీరోయిన్స్ అంతా ఒక చోట చేరి చేసిన హంగామాలో చిరంజీవి లుంగీ డాన్స్ వెంకటేష్ స్టెప్స్ మోహన్ లాల్ మ్యాజిక్ లతో ఈ ఈవెంట్ అదిరిపోయింది. 

తెలుగు తమిళ కన్నడ మలయాళ రంగానికి చెందిన సీనియర్ హీరోలు హీరోయిన్స్ ఒకచోట చేరి చేసిన ఈ హంగామా ప్రతి సంవత్సరం ఆగష్టులో జరుగుతూ ఉంటుంది. ఈసారి ఈ సందడి చెన్నైలోని అలీవ్ బీచ్ ప్రాంతలో జరిగింది. మన టాలీవుడ్ కు సంబంధించి టాప్ హీరోలు చిరంజీవి వెంకటేష్ లతో పాటుగా అనేకమంది దక్షిణాది టాప్ హీరోలు టాప్ హీరోయిన్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

‘ఎయిటీస్ రీ యూనియన్’ పేరుతో జరిగే ఈ ఈవెంట్ లో ఒక్క బాలకృష్ణ తప్ప అందరూ పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్ లో జయసుధ, సుమలత, సుహాసినీ, రమ్యకృష్ణ, రాధ, రాధికలు చేసిన హంగామాతో ఈ ఈవెంట్ అదిరిపోయింది అని టాక్. ఈ ఈవెంట్ లో పాల్గొన్న స్టార్స్ అంతా రెడ్ కలర్ డ్రెస్ లలో రావడమే కాకుండా ఈ పార్టీకి వాడిన వస్తువులన్నీ రెడ్ కలర్ లోనే ఉండేడట్లుగా చూసారు. 

ఈ ఈవెంట్ కు సుహాసిని మరియు ఖుష్భూ చేసిన ఏర్పాట్లకు అందరూ ఫిదా అయిపోయారు అని టాక్. ఎప్పుడూ ఈ కార్యక్రమంలో సందడి చేసే బాలయ్య ఈ కార్యక్రమానికి గల కారణం ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న ‘డిక్టేటర్’ సినిమా. ఈసినిమా షూటింగ్ కోసం బాలకృష్ణ బల్గేరియాలో ఉండటం వల్ల రాలేకపోయాడని తెలుస్తోంది. అయితే ఎంతమంది హీరోలు వచ్చినా బాలయ్య రాకపోవడంతో ఈ ఈవెంట్ ఇన్ కంప్లీట్ గా ఉంది అని ఖుష్భూ వ్యాఖ్యానించడం బట్టి ఆనాటి టాప్ హీరోయిన్స్  లో బాలయ్య రేంజ్ ఏమిటో అర్ధం అవుతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: