బుల్లితెర సూపర్ స్టార్ మెగా స్టార్ అంటూ ఎవరి గురించైనా చెప్పుకోవాల్సి వస్తే అది కచ్చితంగా ప్రభాకర్ గురించే. ఈటివిలో పలు ప్రోగ్రాంలకు హోస్ట్ గా చేసిన ప్రభాకర్ ‘యాహూ’ అనే ఇంట్రెస్టింగ్ ప్రొగ్రాంతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతేకాకుండా నటుడిగా దర్శకుడిగా బుల్లితెరలో తన హవా కొనసాగించాడు. అయితే ఎప్పటినుండో దర్శకుడవ్వాలనుకుంటున్నా కాని సమయం కలిసి రాలేదు ప్రభాకర్ కు.

 

సీరియల్ దర్శకులకు సినిమా అవకాశం ఇస్తే ఎలా అని కొందరు తను కథ చెప్పినా స్పందించలేదట. గీతా ఆర్ట్స్ సెకండ్ బ్యార్ గా రూపొందిన ప్రొడక్షన్ హౌజ్ ద్వారా ఓత్సాహికులందరికి అవకాశాలు ఇస్తున్నారని తెలుసుకున్న ప్రభాకర్ వారి దగ్గరకు వెళ్లి కథ వినిపించాడట. కథ నచ్చిన వారు టోటల్ స్క్రిప్ట్ ని తయారుచేసుకుని రమ్మని చెప్పారట. అలా రెడీ అయిన స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి ఫైనల్ గా సినిమాను ఓకే చేశారు గీతా ఆర్ట్స్ నిర్మాతల్లో ఒకరు బన్నీ వాసు.

 

మా టివి ప్రోగ్రాంలో ప్రభాకర్ :

 

అయితే ప్రభాకర్ తమకు మూడు సమవత్సరాలుగా కథ చెబుతున్నాడని దాన్ని డెవెలప్ చేయించి చేయించి ఇప్పుడు సినిమాగా తెరకెక్కిస్తున్నారని చెప్పారు. సో మూడు సంవత్సరాల ప్రభాకర్ నిరీక్షణ త్వరలో నిజం కానుంది. అల్లు అరవింద్ పర్యవేక్షణలోనే ఈ బ్యానర్లో సినిమాలు వస్తుండటం విశేషం. గీతా ఆర్ట్స్ సెకండ్ బ్యానర్ నుండి వస్తున్న మొదటి సినిమా భలే భలే మగాడివోయ్ రేపు రిలీజ్ అవ్వనుంది.

 

పెద్ద ప్రొడక్షన్ అయిన గీతా ఆర్ట్స్ బ్యానర్ నుండి సెకండ్ బ్యానర్ స్థాపించి దాని ద్వారా చిన్న సినిమాలు, అప్ కమింగ్ డైరక్టర్స్ కి అవకాశాలు ఇవ్వడమే వారి ముఖ్య ఉద్దేశం. సో ఇన్నాళ్ళు సీరియల్స్ డైరెక్ట్ చేసిన ప్రభాకర్ ఇప్పుడు సినిమాలు కూడా డైరెక్ట్ చేయడం గొప్ప విషయం.


మరింత సమాచారం తెలుసుకోండి: