ఇప్పటి వరకు టాప్ హీరోల పై ముఖ్యంగా మెగా కుటుంబం పై సెటైర్లు వేసే దాసరి ఈసారి తన రూట్ మార్చి పూరి జగన్నాథ్ పై సెటైర్లు వేయడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ఈ సంఘటన సంపూర్నేష్ ‘కొబ్బరి మట్ట’ షూటింగ్ ప్రారంభోత్సవ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్ లో జరిగింది. 

ఒకప్పుడు హీరో అంటే మంచివాడు తల్లిదండ్రులను గౌరవించేవాడు, ఊరికి మంచి చేసేవాడు అని చూపిస్తూ హీరో పాత్రను దర్శకులు మలిచే వారని అయితే ఏ ముహూర్తాన పూరి జగన్నాథ్‌ ‘ఇడియట్‌’ సినిమా తీశాడోగానీ అప్పటి నుంచి హీరోకి అర్థం మారి పోయింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు దాసరి. తల్లిదండ్రుల గురించి వెటకారంగా మాట్లాడేవాడు, లవర్‌ని రోడ్డుపై ఏడిపించేవాడు సెటైర్లతో పంచ్ డైలాగ్స్ వేసేవాడు ఈరోజు హీరోగా మారిపోవడంతో నేటి తరం యూత్ కూడ హీరో అంటే ఇలాగే ఉండాలి అన్న అభిప్రాయానికి వచ్చేశారు అంటూ కామెంట్స్ చేసాడు దాసరి. 

ఇదే సందర్భంలో దాసరి మాట్లాడుతూ సంపూర్ణేష్ హీరో కావడం ఒక వింత అని కామెంట్ చేస్తూ అతడి తొలి సినిమా చూసి తాను షాక్ అయ్యాను అంటూ కామెంట్ చేసాడు దాసరి. అయితే సోషల్‌ మీడియాలో సంపూకు ఉన్న పాపులారిటీ చూశాక అతని రేంజ్ అర్ధం అయింది అంటూ ఎటువంటి బ్యాక్ గ్రౌండ్‌ లేకుండా ఈ స్థాయికి రావడమే కాకుండా మూడు రోజుల్లో మూడు కోట్లు కలెక్ట్‌ చేసే మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకోవడం సంపూ గొప్పతనం అంటూ అతడిని ఆకాశానికి ఎత్తేశాడు దాసరి. 

అయితే ఆమధ్య పూరి జగన్నాథ్ ను తెగ పొగిడిన దాసరి తిరిగి యూటర్న్ తీసుకుని పూరీని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏమైంది అంటూ ఆ సమావేశానికి వచ్చిన కొంతమంది కామెంట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: