టాప్ హీరోలు అంతా తామంతా ఒకటే అంటూ మల్టీ స్టారర్ సినిమాలలో నటిస్తూ తమ స్నేహాన్ని చాటుకుంటూ ఉంటే నిన్న రాత్రి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన సంఘటన ఈరోజు ఉదయం వెలుగులోకి రావడంతో అందర్నీ ఆశ్చర్య పరిచింది. భీమవరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసంచేశారు అన్న వార్తలు అందరికీ షాక్ ఇచ్చాయి. 

దీనితో పవన్ అభిమానులు ఆందోళన బాట పట్టినట్లు తెలుస్తోంది. ఈ దుశ్చర్య ఎవరూ చేసారు అనే విషయం పై క్లారిటీ లేకపోయినా పవన్ అభిమానులు మాత్రం ఒక టాప్ హీరో అభిమానులను ఈ విషయమై టార్గెట్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పవన్ పుట్టినరోజునాడు తాము ఎంతో అభిమానంగా పెట్టుకున్న ఫ్లెక్సీలను పాడుచేయడం పవన్ అభిమానులకు షాకింగ్ గా మారింది.

పవన్ అభిమానులు సృష్టిస్తున్న ఈ రగడను తెలుసుకున్న స్తానికిలు పోలీసు వారి సహకారంతో ఈ అలజడి మరింత పెరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై పవన్ అభిమానుల ఆవేశం చూసి స్థానికులు భయపడిపోయారు అని టాక్.  అనుకోని ఈ సంఘటన ఈరోజు ఉదయం టాలీవుడ్ కు షాకింగ్ న్యూస్ గా మారింది.

టాప్ హీరోల పై అభిమానం ఉండటం మంచిదేకాని ఇంత మితిమీరిన అభిమానం ఎటువంటి దురదృష్టకర సంఘటనలకు దారి తీస్తుందో అన్న విషయానికి ఇటువంటి సంఘటనలు ప్రత్యేక్ష ఉదాహరణలు. మరి ఈ విషయం రానున్న రోజులలో ఇంకా ఎన్ని ట్విస్ట్ లు తీసుకుంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: