తెలుగు ఇండస్ట్రీకి చిరంజీవి తనయుడిగా వెండి తెరకు పరిచయం అయిన రాంచరణ్ తీసినవి కొన్ని సినిమాలే.. ఇక రెండవ సినిమా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ చిత్రం ఏ రేంజ్ లో రికార్డు మోతలు మోగించిందో వేరే చెప్పనక్కర లేదు. మగధీర చిత్రం సంచలన విజయం సాధించడం తో పాటు ఆ సంవత్సరానికి ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు మరియూ నందీ స్పెషల్ జ్యూరీ అవార్డులని అందించింది. మగధీర విజయంతో చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించాడు.

తర్వాత వచ్చిన నాయక్,రచ్చ,ఎవడు,గోవిందుడు అందివాడేలే లాంటి సూపర్ హిట్ సినిమాలో తెలుగు ప్రేక్షకుల మరింత దగ్గరయ్యాడు.. తండ్రి ఇమేజ్ ను ఏమాత్రం వాడుకోకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందాడు చెర్రీ. తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘బ్రూస్ లీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు.. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  ఈ సినిమాలో చరణ్ ఓ ఫైట్ మాస్టర్ గా కనిపించ బోతున్నాడు.. సినిమాలకు ఫైట్ కొరియోగ్రఫర్ గా సూపర్ స్టంట్స్ ఉండబోతున్నాయట.. అంతే కాదు ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి.. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున ఇద్దరూ ఒక సినిమాలో కనిపిస్తే ఆ సినిమాకి ఎంతటి క్రేజ్ నెలకొంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

బ్రూస్ లీ చిత్రంలో రాంచరణ్


 ఇక ఇప్పుడు మరో సంచలనం చోటు చేసుకుంటుంది.. సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ సీన్ కి ఓ స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందని భావించాడట శ్రీను వైట్ల అంతే చెర్రీకి మంచి స్నేహితుడు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దగ్గర ఈ విషయం చెప్పి, వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందిగా కోరాడట శ్రీను వైట్ల. ఇందుకు ఎన్టీఆర్ ఏ మాత్రం వెనుకాడకుండా యస్ చెప్పేసాడట. రామ్ చరణ్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఖాయం. ఇప్పుడు సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఈ సినిమా విడుదలకు ముందు ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే...


మరింత సమాచారం తెలుసుకోండి: