సెలబ్రిటీలపై వచ్చే వదంతులు భలే విచిత్రంగా ఉంటాయి. వీటిలో అదిగో పులి.. అంటే అదుగో తోక.. అనే తరహా కబుర్లే ఎక్కువ. ప్రస్తుతం అల్లు అర్జున్ ఆరోగ్యం వస్తున్న వదంతులు కూడా అలాంటివే.. ఆయన సికింద్రాబాద్ లోని యశోదా ఆసుపత్రికి రావడంతో ఆయనకు అనారోగ్యం అంటూ పుకార్లు బయలుదేరాయి. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఇది కాస్త జోరందుకుంది. 

ఈ వదంతులు విని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. అల్లు అర్జున్ చాలా సేఫ్ గా ఉన్నారట. అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి కోసం ఆయన యశోదాకు వెళ్లారు. మరి ఇంతకీ స్నేహాకు ఏమైందనేగా మీ సందేహం.. ఇందులో పెద్దగా కంగారు పడాల్సిందేమీ లేదట. గతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో స్నేహ భుజానికి గాయం అయ్యిందట. 

అప్పట్లోనే ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారట. అయితే ఈ మధ్య తరచూ స్నేహాకు భుజం నొప్పి తరచూ వస్తోందట. అందుకే ఆమెను సికింద్రాబాద్ యశోదాలో చేర్చారు. అల్లు అర్జున్ వచ్చి ఆసుపత్రిలో కొద్దిసేపు ఉండి వెళ్లిపోయారు. ఆ తర్వాత స్నేహాకు మైనర్ ఆపరేషన్ చేశారట. ఆపరేషన్ సజావుగా సాగిందని.. త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేస్తారని తెలిసింది. 

స్నేహ మామగారైన అల్లు అరవింద్ కూడా యశోదా ఆసుపత్రికి వచ్చి డాక్టర్లతో మాట్లాడి వెళ్లారు. ఈ విషయాలు పూర్తిగా తెలియని కొందరు.. అర్జున్ కు ఏదో అయిందని, ప్రమాదం జరిగిందని వదంతులు వ్యాపింపచేయడంతో అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు. అర్జున్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని, అనవసర వదంతులను అభిమానులు నమ్మవద్దని కోరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: