తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ వారసుడిగా మరో యంగ్ హీరో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు..‘ముకుంద’ చిత్రంతో వెండి తెరకు పరిచయం అయిన వరుణ్ తేజ.. వెంటనే క్రిష్ దర్శకత్వంలో ‘కంచె’ సినిమాల నటించాడు.. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. అయితే చిరంజీవి తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాన్ ఒకే వేదికపై  చూడాలని మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఉవ్విళ్లూరుతున్నారు. అప్పట్లో గబ్బర్ సింగ్ ఆడియో వేడుకకు ముగ్గురు అన్నదమ్ములు ఒకే వేదిక పై కనిపించారు.. తర్వాత కొన్ని కారణాల వల్ల ముగ్గురు కలవనే లేదు.

ఈ మద్య చిరంజీవి 60 వ పుట్టిన రోజు సందర్భంగా నాగబాబు చిన్న తమ్ముడిపై బాగా ఆవేశ పడ్డాడు.. అంతే కాదు వాడు మాకు తమ్ముడు మాకు తెలియదా వాన్ని పిలవాలని ఎన్ని సార్లు పిలిచినా రాడు..అంతగా రావాలని కోరిక ఉంటూ మీరే వెళ్లి పిలుచుకు రండీ అంటూ అభిమానుల వద్ద అసహనాన్నా ప్రదర్శించారు. అయితే తెల్లవారి జరిగిన మరో ఫంక్షన్ కి పవన్ కళ్యాన్ అటెండ్ అయ్యాడు.విల‌క్ష‌ణ సినిమాల ద‌ర్శ‌కుడు క్రిష్ డైరెక్ష‌న్‌లో నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టించిన కంచె సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

ఇటీవ‌ల రిలీజ్ అయిన ట్రైల‌ర్‌కు కూడా టాలీవుడ్‌లో ప‌లువురు సెల‌బ్రిటీలు ఫిదా అయిన‌ట్టు కామెంట్ చేశారు. ఈ మూవీ ఆడియో ఫంక్ష‌న్‌కు గ్రాండ్‌గా చేసి…సినిమాకు భారీగా ప్ర‌మోష‌న్ చేయాల‌ని చిత్ర యూనిట్ భావిస్తోంది. కంచె ఆడియోను ఫలక్ నామా ప్యాలెస్ లో నిర్వహించాలని దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ఫంక్షన్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పిలిస్తే ఓ రేంజ్ లో హైక్ రావచ్చు అనుకున్నారు దర్శక,నిర్మాతలు పవన్ ని రిక్వెస్ట్ చేయగా ఆయన కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. తాజాగా మెగా ఫ్యామిలీకి ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌రో షాక్ ఇచ్చాడు.

కంచె చిత్రంలో వరుణ్ తేజ

అబ్బాయి ఆడియో ఫంక్షన్ కి వస్తాడా..! హ్యాండిస్తాడా..!!

గ‌త కొద్ది సంవ‌త్స‌రాలుగా మెగా ఫ్యామిలీలో ఏ హీరోల ఫంక్ష‌న్లు జ‌రిగినా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాత్రం అటెండ్ కావ‌డం లేదు. తాజాగా మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్‌తేజ్ కంచె ఆడియో ఫంక్ష‌న్‌కు ప‌వ‌న్ ముఖ్య అతిథిగా వ‌స్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది అయితే ఈ వార్త‌ల‌కు తెర‌ప‌డింది. అనివార్య కారణాల వల్ల పవన్ ఈ వేడుకకి హాజరు కాలేకపోతున్నాడట. ఆయన ప్లేస్ లో మెగా తనయుడు రాంచరణ్ వస్తాడా..?లేక చిరంజీవి వస్తాడా అన్న విషయం రేపటితో తెలియనుంది. అయితే ప‌వ‌న్ వ‌స్తాడ‌ని ఊరించ‌డంతో ఖుషీగా ఉన్న ఫ్యాన్స్‌కు స‌ర్ది చెప్పేందుకు…ఫంక్ష‌న్‌కు కాస్త అట్రాక్ష‌న్ రావ‌డానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అటెండ్ అవుతాడని ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. వినాయక చవితి రోజున ఆడియో, గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న సినిమాని రిలీజ్ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: