ఈరోజు ఉదయం సాయి ధరమ్ తేజ్ మరొక కొత్త సినిమాను ప్రారంభించాడు. తన మేనమామ చిరంజీవి గుర్తుకు వచ్చేలా ఈసినిమాకు ‘సుప్రీమ్’ అంటూ దిల్ రాజ్ బ్యానర్ లో ప్రారంభం అయిన ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. నందమూరి కళ్యాణ్ రామ్ తొలి షాట్ కు క్లాప్ ఇచ్చాడు. అనేకమంది టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్న ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో ఒక షాకింగ్ న్యూస్ బయట పడింది.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం సాయి ధరమ్ తేజ్ దిల్ రాజ్ ల మధ్య ఒక మెగా డీల్ కుదిరింది అని ఆ డీల్ లో భాగంగానే దిల్ రాజ్ సాయి ధరమ్ తేజ్ తో ఏకంగా 6 సినిమాలు తీయబోతున్నాడని టాక్. ఇప్పటికే ఈ యంగ్ మెగా హీరోతో ‘పిల్లా నువ్వులేని జీవితం’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాలను తీసిన దిల్ రాజ్ ఇప్పుడు ఈరోజు మొదలైన ‘సుప్రీమ్’ తో కలుపుకుని మరో మూడు సినిమాలు తీయబోతున్నాడని టాక్.

ఈ సినిమా తరువాత దిల్ రాజ్ సాయి ధరమ్ తేజ్ తో  ‘తిక్క’, ‘శతమానం భవతి’ అనే సినిమాలు వరసగా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో కూడా తేజ్ తన మేనమామ చిరంజీవిని అనుసరిస్తున్నాడు అంటూ కామెంట్స్ వినపడుతున్నాయి. చిరంజీవి మెగా స్టార్ కాకముందు ప్రముఖ నిర్మాత క్రాంతి కుమార్ బ్యానర్ లో ఇలా  5 సినిమాలు వరసగా చేసాడు. 

మేనమామ పాటలను రీమిక్స్ చేయడమే కాకుండా చిరంజీవి అతన కెరియర్ కు సంబంధించి అనుసరించిన ఎత్తుగడలను కూడ సాయి ధరమ్ తేజ్ పక్కాగా అనుసరిస్తున్న నేపధ్యంలో ఈ యంగ్ మెగా హీరో చరణ్ బన్నీలకు షాక్ ఇవ్వబోతున్నాడా అనే కామెంట్స్ వస్తున్నాయి. ఏది ఏమైనా రేపు విడుదల కాబోతున్న ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ రిజల్ట్ బట్టి ఈ యంగ్ మెగా హీరో కెరియర్ ఆధారపడి ఉంటుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: