హైదరాబాద్ లోని సినీ ప్రముఖుల, బుల్లితెర నటుల ఇళ్ళపై ఐటీ శాఖ దాడులు నిర్వహించడంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడులు మధ్యాహ్నం పన్నెండు నుండి కొనసాగినట్టు సమాచారం. సుమారు నలభై మంది ఐటీ అధికారులు కమేడియన్ బ్రహ్మానందం, బుల్లితెర నటులు ఉదయభాను, సుమ, ఝాన్సీ, ఓంకార్, గాయనీ సునీత, గీతామాధురి ఇళ్ళతో పాటు సినీ ప్రముఖుల ఇళ్ళపై సోదాలు నిర్వహించారు. వీరి ఆదాయానికి సంబంధించి ఆధారాలతోపాటు పలు డాక్యుమెంట్లను పరిశించారు. పన్ను ఎగవేతకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: