టాలీవుడ్ – కోలీవుడ్ – బాలీవుడ్ లను వేరు చేస్తూ క్రేజీ బ్యూటీ శ్రుతిహాసన్ చెపుతున్న లెక్కలు నిర్మాతలను గందరగోళంలో పడేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ లెక్కలు వింటున్న నిర్మాతలు శ్రుతి తెలివిగా ప్రవర్తిస్తోందా? లేదంటే అతి తెలివి తేటలు ప్రదర్శిస్తోందా అంటూ కామెంట్స్ చేసుకుంటున్నట్లు టాక్. 

హీరోలు కాని హీరోయిన్స్ కాని వారు నటించిన సినిమాలు సూపర్ హిట్ అయినప్పుడు తమ పారితోషికాలను పెంచడం సినిమా రంగంలో సర్వసాధారణం. అయితే శ్రుతిహాసన్ తన పారితోషిక విషయంలో చెపుతున్న లెక్కలు విచిత్రంగా ఉన్నాయి అని అంటున్నారు. టాలీవుడ్ లో ‘శ్రీమంతుడు’ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ఆమె క్రేజ్ తారా స్థాయికి చేరడంతో టాలీవుడ్ సినిమాలకు సంబంధించి 1.50 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు టాక్.

తన తమిళ సినిమాలకు సంబంధించి కోలీవుడ్ నిర్మాతల దగ్గర కోటి రూపాయలు లేదంటే ఇంకా కొంచెం తక్కువకే తనతో నటించే హీరోల స్థాయి బట్టి డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బాలీవుడ్ సినిమాలకు సంబంధించి శ్రుతి లెక్కలు మరీ విచిత్రంగా ఉన్నాయి. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థలు బాలీవుడ్ టాప్ హీరోలతో నిర్మించే సినిమాలకు తనకు హీరోయిన్ గా అవకాశం ఇస్తే 50 లక్షల నుండి 75 లక్షల పారితోషికానికే నటిస్తాను అంటూ బాలీవుడ్ నిర్మాతలకు శ్రుతి సంకేతాలు పంపుతోందని వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ లెక్కల గజిబిజి చాలామంది నిర్మాతలకు అర్ధం కాకపోవడంతో నిర్మాతలు షాక్ అవ్వడమే కాకుండా శ్రుతిహాసన్ కు అతి తెలివి పెరిగింది అని కామెంట్స్ తెలుస్తోంది. టాలీవుడ్ సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా మారిన శ్రుతి అన్ని భాషల నిర్మాతలకు డిస్కౌంట్ ఇస్తూ టాలీవుడ్ నిర్మాతల దగ్గర మాత్రం ఇలా ముక్కుపిండి ఎందుకు వసూలు చేస్తోందో శ్రుతిహాసన్ కే తెలియాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: