వాణిజ్య ప్రకటనల్లో సాధారణంగా సినిమా హీరోలు,హీరోయిన్లు,మోడల్స్,క్రికెటర్స్ లాంటి సెలబ్రెటీలు ఎక్కువ నటిస్తుంటారు..వారి ఇమేజ్ ని బట్టి యాడ్స్ లో తీసుకోవడానికి కార్పోరేట్ సంస్థలు పోటీలు పడుతుంటాయి. ఈ మద్య బాహుబలి చిత్రంతో హీరో ప్రభాస్ కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడంతో ఆయన వెంట కార్పొరేట్ సంస్థలు పడుతున్నాయి..  ప్రభాస్ మహేంద్రవారి TUV300 కు నేషనల్ అంబాసిడర్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభాస్ తో యాడ్ ని షూట్ చేసారు..ఇప్పుడు సోషల్ మీడియాలో యాడ్ సంచలనం రేపుతుంది.

ఇదే బాటలో విశ్వనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ కూడా ఒక యాడ్ లో నటించారు. కమల్ అభిమానుల్లో ఈ మధ్య కాలంలో చర్చనీయాంసంగా మారిన యాడ్ వచ్చేసింది. కమల్ కెరీర్ లో తొలిసారిగా ఆయన ఓ యాడ్ లో నటించారు. ఆ యాడ్ ఇప్పుడు టీవిలో ప్రసారానికి సిద్దమైంది. నిముషం రెండు సెకన్లు సాగే ఈ యాడ్ లో కమల్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.వాణిజ్య ప్రకటనలకు దూరంగా ఉంటున్న సుప్రసిద్ధ నటుడు కమల్ హాసన్ తన జీవితంలో తొలిసారి ఓ ప్రకటనలో కనిపించాడు. పోతీస్ వారు తమిళనాడు లో అతి పెద్ద టెక్సటైల్, జ్యూయలరీ షో రూమ్స్ చైన్ కలిగి ఉన్నారు.

పోతీస్ యాడ్ లో కమల్ హాసన్


ఈ యాడ్ లో కమల్ తన నిజ జీవిత పాత్ర అయిన కమల్ గానే కనిపించారు. యాభై ఏళ్లుగా తనను అభిమానిస్తూ వస్తున్న అభిమానులను ఉద్దేశించి, కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యాడ్ సాగింది. ఈ యాడ్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఎయిడ్స్ తో భాధ పడుతున్న చిన్నారులకు అంద చేయాలనే ఆయన చేస్తున్నట్లు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ వంటి కమల్ సమకాలీన దిగ్గజ హీరోలు యాడ్స్లో నటించారు. కానీ కమల్ తన కెరీర్లో ఇప్పటి వరకూ ఏ బ్రాండ్కూ అంబాసిడర్గా వ్యవహరించలేదు. తొలిసారి ఓ ప్రకటనలో నటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: