ఈ కాలంలో సినిమాల్లో నెగ్గుకు రావాలంటే కేవలం బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే కాదు వారిలో టాలెంట్ కూడా ఉండాలి. అయితే ఈ మధ్య కుర్ర హీరోలు తమ తమ టాలెంట్ తో కుమ్మేస్తున్నారనే చెప్పొచ్చు. ప్రస్తుతం హవా కొనసాగిస్తున్న వారు సినిమాల సెలక్షన్ విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఆ కోవలోనే స్టార్ కెమెరామెన్ చోటా.కె.నాయుడు మేనల్లుడు సందీప్ కిషన్ కూడా స్వతహాగా మంచి అబివృద్ధిలోకి వస్తున్నాడు. ప్రస్థానం, స్నేహగీతంతో స్టార్ట్ అయిన సందీప్ కెరియర్ రెండు హిట్లు మూడు యావరేజ్ సినిమాలతో అంచలంచెలుగా ఎదుగుతూ వస్తున్నాడు.


అయితే ప్రస్తుతం ఈ హీరో ఒక డేరింగ్ డెశిషన్ తీసుకోబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. తమిళ్లో జయం రవి హీరోగా రీసెంట్ సూపర్ హిట్ కొట్టిన 'తని ఒరువన్' సినిమా తెలుగు రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. చరణ్ హీరోగా చేస్తున్న ఆ సినిమాకు రేసుగుర్రం సురేందర్ రెడ్డి డైరక్షన్ చేయబోతున్నాడు. అయితే ఆ సినిమాలో హీరోకి థీటుగా పవర్ఫుల్ విలన్ రోల్ చేశాడు ఒకప్పటి హ్యాండ్సం హీరో అరవింద్ స్వామీ. తెలుగులో మాత్రం చేయనని చెప్పాడు.


ఆ విలన్ క్యారక్టర్ ముందు రానా, తర్వాత నాగార్జున ఇలా వరుసెంట అందరి పేర్లు వినిపించి చివరకు సందీప్ కిషన్ దగ్గర ఆగిందట. ప్రస్తుతం హీరోగా తన హవా కొనసాగిస్తున్న ఈ హీరో సడెన్ గా విలన్ అవ్వడం వెనుక తన ఆలోచన ఏమై ఉంటుందా అనే డౌట్ కలుగుతుంది ప్రేక్షకులకు. కుర్ర హీరోల్లో జోష్ ఉన్న సందీప్ ఇలాంటి డేరింగ్ డెశిషన్ ఎందుకు తీసుకుంటున్నాడో తెలియాలి. అయితే మెగా అభిమానులకు దగ్గరవ్వడం కోసం విలన్ గా ఓకే అన్నాడా లేదా ఇంకా వేరే కారణం ఏదైనా ఉందా అన్నది తెలియాలి.


సందీప్ కిషనే తెలుగు తని ఒరువన్ విలన్ అని జోరుగా వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఆ సినిమా చూసి ఒకవేళ ఆ క్యారక్టర్ నచ్చి సందీప్ ఓకే అన్నాడా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చరణ్ మాత్రం తన అప్ కమింగ్ మూవీ బ్రూస్ లీ రిలీజ్ కార్యక్రమాల్లో హడావిడిగా ఉన్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: