మెగాహీరో వరుణ్ తేజ్ నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ కంచె. ప్రస్తుతం కంచె మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిచేసుకొని, రిలీజ్ కోసం ఎదురుచూస్తుంది. అక్టోబర్ నెలలో వరుస సినిమాలు రిలీజ్ కి రెడీ ఉండటంతో, తన మూవీని నవంబర్ నెలలో రీలీజ్ కి పోస్ట్ పోన్ చేసుకుంది. అయితే ఇప్పటి కే కంచె మూవీకి సంబంధించిన ప్రి బిజినెస్ క్లోజ్ అయింది.


రిలీజ్ కి ఇంకా చాలా సమయం ఉండటంతో, ఈ మూవీని ఎన్ని రకాలుగా బిజినెస్ చేసుకోవచ్చో నిర్మాతలు ఆలోచిస్తున్నారు. ఇక కంచె మూవీ వరుణ్ తేజ్ రెండో సినిమా అయినప్పటికీ ఈ మూవీపై ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. మెగాఫ్యాన్స్ ఈ వైవిధ్యమైన మూవీని చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. 


రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యానికి, ఒక ప్రేమకథకు ముడిపెట్టడంతో ఈ మూవీపై ప్రత్యేకమైన ఆసక్తిని తీసుకురాగలిగాడు దర్శకుడు క్రిష్.  ఇక కంచె మూవీని కోలీవుడ్ లోనూ రిలీజ్ చేయనున్నారు. వరల్డ్ వార్ నేపథ్యంలో కథ ఉండటంతో ఈ మూవీని చూడటానికి కోలీవుడ్ ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.


అందుకే కంచె మూవీని నవంబర్ 6న తమిళంలోనూ డబ్ చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే తమిళ నిర్మాతలు కొంత మంది డబ్బింగ్ రైట్స్ కోసం పోటీ పడుతున్నారు. పోటీ ఉన్నప్పుడు కంచె తమిళ వెర్షన్ ని మార్కెట్ చేసుకోవటం మంచిదని నిర్మాతలు సైతం భావిస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: