పు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘రుద్రమదేవి’ స్పెషల్ షోను గుణశేఖర్ తన సన్నిహితుల కోసం నిన్న రాత్రి ప్రదర్శించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ స్పెషల్ షోకు గుణశేఖర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న అనేకమంది ప్రముఖులు వచ్చినట్లుగా ఫిలింనగర్ లో వార్తల హడావిడి జరుగుతోంది. ఈ స్పెషల్ షోను చూసిన ప్రతి వ్యక్తి గుణశేఖర్ ను ప్రత్యేకంగా అభినందించడంలో ఈసినిమా ఘన విజయం పై గుణశేఖర్ మరింత నమ్మకంగా ఉన్నాడు అని టాక్.

ముఖ్యంగా సినిమా చివరి 30 నిముషాలు ‘రుద్రమదేవి’ ఘన విజయానికి ఆయువుపట్టులా మారిందని అల్లుఅర్జున్ గోన గన్నారెడ్డి పాత్ర సినిమా చూస్తున్న వాళ్ళను మంత్రముగ్ధులను చేసిందని ఈసినిమా స్పెషల్ షోను చూసిన చాలామంది గుణశేఖర్ వద్ద కామెంట్ చేసినట్లు టాక్. ముఖ్యంగా టెక్నికల్ గా ‘రుద్రమదేవి’ లోని సన్నివేశాలు గ్రాఫిక్స్ కూడ అందర్నీ ఆకట్టుకుని తీరతాయని గుణశేఖర్ సన్నిహితులు కామెంట్ చేయడమే కాకుండా ఈ సినిమా విడుదల కాకుండానే అభినందనలతో ముంచెత్తి వేసారని వార్తలు వస్తూన్నాయి.

ఈవార్తలు ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించి ఇరు రాష్ట్రాలలోని మేజర్ సిటీస్‌లో అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ ఆన్‌లైన్‌లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. బుధవారం సాయంత్రమే చాలా మల్టీప్లెక్స్‌లో టికెట్స్ అమ్ముడుపోగా, చిన్న థియేటర్స్ కూడా గురువారం ఉదయంనాటికి హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. దాదాపు వీకెండ్ వరకు ‘రుద్రమదేవి’ విడుదల అయ్యే ధియేటర్ల టికెట్స్ అయిపోయాయని తెలుస్తోంది.

దీనితో ‘రుద్రమదేవి’  ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని బయ్యర్స్ ఆశిస్తున్నారు.ఈసినిమా విడుదలైన మొట్టమొదటి రోజునే ప్రపంచవ్యాప్తంగా 15 నుంచి 20 కోట్ల వసూళ్లు రావచ్చని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రేపు తెల్లవారుఝామున 3 నుంది ‘రుద్రమదేవి’ స్పెషల్ షోల హంగామా ప్ర్రారంభం కాబోతోంది. అందరి అంచనాలను తల క్రిందులు చేస్తూ ‘రుద్రమదేవి’ చేస్తున్న హంగామా టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: