ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారికి ఆసక్తిని రేకెత్తించిన రుద్రమదేవి మూవీ నేడు థియోటర్స్ ని హిట్ చేసింది. దీంతో ఈ మూవీకి చూడటానికి తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిని చూపిస్తున్నారు. థియోటర్స్ వద్ద ఈ మూవీపై కొద్దిపాటి అనుమాలు తప్పితే, మిగతాదంత మూవీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు.


మూవీపై ఎటువంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా ప్రేక్షకుడు థియోటర్ కి రావటమే..ఈ మూవీ సక్సెస్ కి కారణం అయింది. రుద్రమదేవి మూవీపై మొదటి నుండి నెగిటివ్ టాక్స్ అనేది నడుస్తూనే ఉన్నాయి. దీంతో మూవీపై ప్రేక్షకుల్లో ఎటువంటి ఎక్స్ పెక్టేషన్స్ లేవు. తాజాగా మూవీపై జరిగిన భారీ పబ్లిసిటి కారణంగా, అందులోనూ ఈ మూవీలో అల్లుఅర్జున్ ఎక్కువసేపు కనిపించటం వల్ల రుద్రమదేవి మూవీని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారు.


ఇక థియోటర్ సీట్లో కూర్చున్న ప్రేక్షకుడు...,తెలిసిన రుద్రమదేవి స్టోరీని విజువల్ పరంగా చూసుకుంటూ, కంపేరిజన్ చేసుకుంటాన్నాడు. అర్ధరాత్రి నుండి చాలా థియోటర్స్ వద్ద రివ్యూవర్స్ కి స్పెషల్ షోలని, అలాగే అభిమానులకి బెన్ఫిట్ షోలని ప్రదర్శించారు.


రివ్యూవర్స్ సైతం ఈ మూవీకి మంచి రేటింగ్స్ ఇవ్వటంతో మూవీపై పాజిటివ్ టాక్స్ పెరుగుతున్నాయి. ఇక అభిమానుల వద్ద నుండి మూవీపై పొగడ్తల వర్షం రాకపోయినా, ఇప్పటి వరకూ నెగిటివ్ టాక్ ని మాత్రం పెద్దగా సంపాదించుకోలేదు. దీంతో ఓవరాల్ గా రుద్రమదేవి థియోటర్ టాక్ గుడ్ అని ప్రేక్షకులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: