భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన రుద్రమదేవి ఎట్టకేలకు ఈ రోజు థియోటర్స్ ని విడుదల అయ్యింది. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా ఈ మూవీ రిలీజ్ అయితే, గుణశేఖర్ కోట్ల రూపాయల్లో నష్టపోవాల్సిందే అనే ట్రేడ్ లెక్కలు ఈ రోజు తప్పుగా నిలుస్తున్నాయి. మూవీకి సంబంధించిన కొన్ని విషయాలు గుణశేఖర్ కి తోడుగా నిలవటంతో, దాదాపు తను సేఫ జోన్ లోకి వెళ్ళినట్టే అని అంటున్నారు.


దీనికి సంబంచిన వివరాల్లోకి వెళితే.. రిలీజ్ కి మరో వారం రోజులు ఉండగా గుణశేఖర్ కి అదృష్టం తరుముకుంటూ వచ్చిందనే చెప్పాలి. అప్పటి వరకూ రుద్రమదేవి మూవీకి ప్రమోషన్స్ లేక, నెగిటివ్ టాక్స్ తో హోరెత్తుతుంది. అనూహ్యంగా  చిత్రంలో నటించిన ముఖ్య తారలు అనుష్క, అల్లు అర్జున్, రానా వంటి వారు మూవీ ప్రమోషన్స్ ని ప్రేక్షకుల్లోకి భారీగా తీసుకువెళ్ళారు. ఇక కొన్ని ఏరియాల్లో రిలీజ్ కి వారం రోజుల ముందు వరకూ బిజినెస్ పై హైప్ క్రియేట్ అవ్వక తక్కువకే అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది.


ప్రమోషన్స్ అనంతరం క్రియేట్ వచ్చిన హైప్ తో అనుకోని విధంగా అప్పటి వరకూ ఖాళీగా ఉన్న కొన్ని ఏరియాలు సైతం, మంచి రేటుకే అమ్ముడుపోయాయి. ఈ మూవీపై తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ వినోదపన్ను మినహాయింపుతో చాలా మంది బతిపోయారు. ఇక అనుష్క సైతం ఈ మూవీ రిలీజ్ విషయంలో చాలా సహాయమే చేసింది.


రుద్రమదేవి రిలీజ్ రోజున తను నటించిన అనుష్క నటించిన జీరోసైజ్ మూవీ రిలీజ్ అవ్వాల్సి ఉంది..కానీ రిలీజ్ డేట్ ని  రుద్రమదేవి పోటీ నుండి తప్పించే విషయంలో అనుష్కదే కీలక పాత్ర వహించింది. మొత్తానికి రుద్రమదేవి రిలీజ్ కి గుణశేఖర్ కు అన్నీ కలిసొచ్చాయ్ అంటూ టాక్స్ వినిపిస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: