ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్న రాజమౌళిని అభినందిస్తూ ‘ఈగ’ ప్రేమతో ఒక లేఖ వ్రాసి మీడియాకు విడుదల చేసింది. ఈలేఖలో ‘ఈగ’ రాజమౌళి పై చేసిన వ్యాఖ్యలు అత్యంత ఆ శక్తి దాయకంగా ఉన్నాయి. పెంట కుప్పల పై తిరిగే తనను సూపర్ స్టార్ చేసిన రాజమౌళికి ‘పుట్టినరోజు శుభాకాంక్షలు’ తెలియచేస్తూ తనను ఎందుకు మర్చిపోయారు అంటూ రాజమౌళిని ప్రశ్నించడమే కాకుండా తన ‘ఈగ 2’ సీక్వెల్ ఎప్పుడూ అంటూ జక్కన్నను ఈగ ఈ బహిరంగ లేఖలో ప్రశ్నించింది.

‘బాహుబలి’ సినిమా కోసం ‘కిరి కిరి’ భాషను సృస్టించిన రాజమౌళి తమ ఈగల కోసం ‘జ్ జ్ జ్ జ్ జ్’ పదాలు ఉండేదట్లుగా ఒక భాషను సృష్టించి తమ జాతి భాషకు గుర్తింపు తెమ్మని ఈగ రాజమౌళిని అభ్యర్ధించింది. ‘బాహుబలి’ మొదటిరోజు మొదటి షో సినిమా టిక్కెట్ల కోసం అందరూ విపరీతమైన టెన్షన్ పడితే తాను మాత్రం టిక్కెట్టు కొనకుండా హాయిగా గాలిలో ఎగురుతూ ధియేటర్ లోనికి వెళ్ళి ‘బాహుబలి’ ని లెక్కలేని అన్ని సార్లు చూసాను అని ‘ఈగ’ గొప్పగా చెప్పుకుంది.

‘బాహుబలి’ ని చూసి అందరూ అభినందిస్తున్న, రాజమౌళి దగ్గరకు వచ్చి అభినందనలు తెలియచేయాలని తాను ప్రయత్నించినా సినిమా రంగానికి చెందిన పెద్దలందరూ రాజమౌళికి షేక్ హ్యాండులు ఇస్తూ ఉంటే ఆ హడావిడి మధ్య తనను నలిపెస్తారు అన్న భయంతో రాజమౌళికి కనపడకుండా పారిపోయాను అని చెప్పుకొచ్చింది ఈగ.

తనతో తీసిన సినిమా సూపర్ హిట్ కావడంతో తనలాంటి చిన్నచిన్న జీవుల పై సినిమాలు తీయగల సత్తా ఒక్క రాజమౌళికి తప్ప మరెవ్వరికీ లేదు అని ఈగ పొగుడుతూ ‘బాహుబలి’ లో హీరో ప్రభాస్ లా తనకు కూడా ‘ఈగ 2’ లో సిక్స్ ప్యాక్ ని క్రియేట్ చేస్తే చూసుకుని మురిసి పోవాలని ఉంది అంటూ ‘బాహుబలి’ మోజులో తనను మర్చి పోవద్దూ అంటూ ఈగ వ్రాసిన ఈ ప్రేమలేఖ ఈరోజు మీడియాకు హాట్ టాపిక్. ఈ ఈగ ప్రేమలేఖను చూసి అయినా రాజమౌళి తన మనసు మార్చుకుని ‘బాహుబలి 2’ తరువాత ‘ఈగ 2’ సీక్వెల్ పై దృష్టి పెడతాడో లేదో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: