తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా పవన్ కళ్యాన్ హీరోగా ‘అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు..తర్వాత వచ్చిన సినిమాలు యావరేజ్ టాక్ వచ్చినప్పటకీ తమిళ డైరెక్టర్ ఎస్ జే సూర్య దర్శకత్వంలో వచ్చిన తమిళ రిమేక్ ‘ఖుషి’ పవన్ కళ్యాణ్ కి తన కెరీర్ లోనే పెద్ద ఘనవిజయాన్ని సాధించిపెట్టింది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అంతే కాకుండా ఈ సినిమా ద్వారా ఎస్ జే సూర్యకి కూడా దర్శకుడిగా మంచి పేరు వచ్చింది. ఖుషి తమిళంలో సూపర్ హిట్. తెలుగులో బ్లాక్ బస్టర్. హిందీలోకి కూడా రీమేకై అక్కడా బాగానే ఆడింది. డైరెక్టర్ ఎస్.జె.సూర్యకు ఈ సినిమా దేశవ్యాప్తంగా పేరు తెచ్చిపెట్టింది.

తర్వాత తెలుగులో ఎస్ జే సూర్య మహేష్ బాబుతో నాని, పవన్ తో పులి సినిమా తీసీ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందాడు. తర్వాత తెలుగులో సూర్యని చూడనేలేదు. ఇక ఎస్ జే సూర్య కెరీర్ బ్లాక్ బ్లస్టర్ సినిమా ‘ఖుషి’ సీక్వెల్ తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సీక్వేల్ లో తమిళంలో హీరోగా విజయ్ నటిస్తున్నాడని సమాచారం. ఒకప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు అందుకే సీక్వెల్ విజయ్ ని తీసుకోవాలని ఆలోచనలో ఉంది.

ఇకపోతే భారీ బడ్జెట్ తో నిర్మించిన ‘పులి’ సినిమా కూడా విజయ్ కి పెద్దగా పేరు తీసుకురాకపోవడంతో తర్వాత వచ్చే సినిమా మంచి హిట్ కొట్టాలని చూస్తున్నాడు.  విజయ్ సరసన  సరసన నయనతారను హీరోయిన్‌గా అనుకుంటున్నారు. 'ఖుషి' సినిమాతో అప్పట్లో జ్యోతిక పెద్ద స్టార్ అయింది. సీక్వెల్లోనూ హీరోయిన్ పాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్ది. నయన్‌ను హీరోయిన్‌గా ఎంచుకున్నాడు. 

ఖుషి చిత్రంలో పవన్ కళ్యాన్, భూమిక


ఇక ‘ఖుషి’ సీక్వెల్ అనగానే అందరి చూపు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ వైపు మళ్లింది. అప్పట్లో అంతంత మాత్రం పేరున్న పవన్ కి ఈ సినిమా బ్లాక్ బ్లస్టర్ తీసుకురాగా ఇప్పుడు ఆయనకు ఉన్న క్రేజ్ కి ఇలాంటి లవ్ స్టోరి సినిమా వస్తే ఏ రేంజ్ లో ఆడుతుంతో ఊహించుకోవచ్చు. ప్రస్తుతం పవన్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు.. ఈ సినిమాత తర్వాత ఆయన ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ సినిమాలో చేయానున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఖుషి సీక్వెల్ లో పవన్ నటిస్తాడా..? ఆ ప్లేస్ లో సూర్య వేరే హీరోని తీసుకుంటాడా వేచి చూడాల్సిందే


మరింత సమాచారం తెలుసుకోండి: