భారత దేశ తెలుగు తేజానికి అరుదైన గౌరవం దక్కింది..నం గణతంత్ర దినోత్సవం జరుపుకున్న జనవరి 26నే, ఆస్ట్రేలియా తన జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంది. ప్రతి ఏడాది ఆ రోజున దేశానికి సేవలందించిన ఉత్తమ వ్యక్తులకు వివిధ రకాల పురస్కారాలతో సత్కరిస్తుంది. ఈసారి ఆస్ట్రేలియా అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా' తెలుగు వ్యక్తి దక్కింది. అమెరికాలో స్థిరపడ్డ సత్య నాదెళ్ల ఏకంగా సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు సీఈఓగా ఎంపికై సత్తా చాటగా, భౌతిక శాస్త్రవేత్తగానే కాక అధ్యాపకుడిగానూ విశేష సేవలందిస్తున్న చెన్నుపాటి జగదీశ్ కు ఆస్ట్రేలియాలో అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా’ లభించింది.

కృష్ణా జిల్లా మారుమూల పల్లె వెల్లూరిపాలెంలో జన్మించిన జగదీశ్ 1977లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీ వర్సిటీలో 1986లో పీహెచ్ డీ పూర్తి చేసి, కొంతకాలం పాటు కెనడాలో అధ్యాపకుడిగా పనిచేశారు. అనంతరం 1990లో ఆస్టేలియా వెళ్లారు. ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం యూనివర్సిటీలోని సెమీ కండక్టర్ ఆప్టో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీ విభాగాలకు అధిపతిగానే కాక ఆస్ట్రేలియన్ నేషనల్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీకి డైరెక్టర్ గానూ కొనసాగుతున్నారు.

చెన్నుపాటి జగదీశ్


ఈ సందర్భంగా చెన్నుపాటి జగదీశ్ మాట్లాడుతూ ఈ పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్సిటీ (ఏఎన్‌యూ)లో సెమీ కండక్టర్ ఆప్టో ఎలక్ట్రానిక్స్, నానో టెక్నాలజీ రంగాలపై గత 25 ఏళ్లుగా తాను సేవలందిస్తున్నానని తెలిపారు. నానో టెక్నాలజీ రంగంలో పరిశోధన చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అందిస్తోన్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: