అమెరికాలో రోజు రోజుకి హింస దారుణంగా పెరిగిపోతుంది. ఇక్కడ విపరీతంగా గన్ కల్చర్ పెరిగిపోతుంది. విద్యార్థులు సైతం ఇక్కడ గన్స్ పెట్టుకొని తిరుగుతున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా ఓ విద్యార్థి తన క్లాస్ మెట్ ని కాల్చడానికి ప్రయత్నించి పారిపోతుండగా పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. మరి కొందరు ఉన్మాదులు స్కూల్స్ పై, షాపింగ్ మాల్స్ లో కాల్పులు జరిపిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.

తాజాగా  అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో దుండగులు జరిపిన కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. సాయుధులైన దుండగులు తుపాకితో జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతిచెందారు. మరి కొందరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు.  

ఈ సంఘటన పిట్స్ బర్గ్ కు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్న విల్కిన్ బర్గ్ లో చోటు చేసుకుంది. ఇద్దరు సాయుధులైన దుర్మార్గులు విచ్చలవిడిగా కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షుల కథనం.సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. దుండగుల వేటలో పోలీసులు ఉన్నారని త్వరలో పట్టుకుంటామని అక్కడి పోలీస్ అధికారులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: