ఉగాది పండుగ పురస్కరించుకొని గత రెండు సంవత్సరాలు గా ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ చిత్రం భారీ అంచనాల మద్య విడుదలైంది. అయితే ఈ చిత్రంపై ఎన్ని అంచనాలో వేశారో అవన్నీ తారుమారయ్యాయి. ఇక కలెక్షన్ల పరంగా 50 కోట్లు దాటిన ఈ చిత్రం అమెరికాలో బాగానే నడుస్తుంది. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని చూసి తిరిగి వస్తూ కారు యాక్సిడెంట్ కు గురై చనిపోయాడు ఓ పవన్ అభిమాని. అమెరికాలో గుంటూరు కు చెందిన ఎం.జయభారత్ కుమార్ రెడ్డి  టెక్సాస్ లో ఎమ్మెస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను పవన్ కళ్యాన్ వీరాభిమాని. 


పవర్ స్టార్ సర్దార్ సినిమా రిలీజ్ కావడంతో ఆ సినిమా చూడటానికి ఈనెల 9 న వెళ్లి సినిమా చూసి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న కారు అత్యంత వేగంగా వచ్చి డీ కొట్టడంతో జయభారత్ కు తీవ్ర గాయాలు అయ్యాయి దాంతో ఆసుపత్రికి తరలించారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో సర్జరీ కూడా చేసారు కానీ కోమాలోకి వెళ్ళిన జయభారత్ కుమార్ రెడ్డి 17 వ తారీఖున చనిపోయినట్లు డాక్టర్లు ద్రువీకరించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు 


మరింత సమాచారం తెలుసుకోండి: