ఆస్ట్రేలియాలో మరో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఓ ఎన్నారై దుర్మరణం చెందారు. భారత్ కి చెందిన సోనీజోస్ తన భార్యతో కలిసి ఆస్ట్రేలియాలో వుంటున్నాడు. గత ఆదివారం ఉదయం జోస్ తన కుటుంబంతో కలిసి పెర్త్ ఎయిర్ పోర్టుకు వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న మరో కారు అత్యంత వేగంగా వచ్చి ఢీ కొనడంతో జోస్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
ఈ ప్రమాదంలో ఆయన భార్య అల్ఫొన్సాకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న వారు అల్ఫొన్సాను దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అయితే అల్ఫొన్సా తీవ్ర గాయాలు కావడంతో ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ విషయం తెలియడంతో కేరళలోని సోనీ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. కేరళలోని కొట్టాయంకు చెందిన జోస్ దంపతులు ఆస్ట్రేలియాలో చైల్డ్ ప్రొటక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు.