ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు కువైట్‌లో ఘనంగా జరిగాయి. ఎస్‌వీఎస్‌ కార్గో కార్యాలయ ప్రాంగణంలో తెలుగుదేశం కువైట్‌ విభాగం అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ ఆదర్శంగా, చంద్రబాబునాయుడు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. కనీసం రాజధాని లేకండా విడిపోతే చంద్రబాబు పరిపాలన చాతుర్యంతో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలపడానికి చేస్తున్న కృషిని మరువలేమని సుధాకర్‌రావు అన్నారు.



చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అదృష్టమని ఇంద్రాణి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ అధినేత ఇంద్రకుమార్‌ చెప్పారు. చరిత్రపుటల్లో రాష్ట్రపేరును నిలుపుతారని, 2019లోనూ ఆయననే సీఎంగా చేయడానికి మనమంతా కృషి చేయాలని సభ్యులను కోరారు. ప్రవాస కాపుబలిజ సేవాసంఘం అధ్యక్షుడు, తెలుగు కువైట్‌ వెల్ఫేర్‌ సమన్వయకర్త మురళి, పీఆర్వో ఈశ్వర్‌నాయుడు, మీడియా సమన్వయకర్త రవికుమార్‌ మాట్లాడారు. కార్యక్రమంలో గల్ఫ్‌ నందమూరి అభిమానుల సంఘం అధ్యక్షుడు వేగి వెంకటేశ్‌, నారా లోకేశ్‌ సేవాసమితి అధ్యక్షుడు పట్టాభిరామ, ఆంధ్రాయూత్‌ కార్యవర్గ సభ్యులు, తెలుగుదేశం కువైట్‌ సభ్యులు సుబ్బారెడ్డి, ముస్తాక్‌, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: