ప్రధాని మోదీ మూడేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అమెరికా డల్లాస్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భాజపా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో తెలుగువారు పాల్గొన్నారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారు శ్రీరామ్‌ వెదిరె ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బచావత్‌ అవార్డు, కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన నదీ యాజమాన్య బోర్డుకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం వంటి అంశాలపై ఆంధ్రా, తెలంగాణ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా కర్ణాటక, మహారాష్ట్రలను కృష్ణానదీ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: