ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60ఏళ్లకు పెంచిన ఏపీ సీఎం చంద్రబాబును ఘనంగా సన్మానించాలని నిర్ణయించుకున్నట్టు ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. ఈ నెల 12న విజయవాడలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో చంద్రబాబును సన్మానిస్తామన్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు 60 ఏళ్ల పదవీ విరమణను వర్తింపజేయవద్దని బాబును కోరతామని అశోక్ బాబు చెప్పారు. ఉద్యోగులకు కేటాయించిన భూములను రద్దు చేసే అధికారం ఏ ఒక్కరికీ లేదన్న అశోక్ బాబు, ఈ విషయంలో తెలంగాణ సీఎంను కలిసిన తర్వాత స్పష్టత ఇస్తామని చెప్పారు. ఏపీఎన్జీవోలకు కేటాయించిన భూముల్లో ఎందుకు ఇళ్లు నిర్మించలేదో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరిస్తామని అశోక్ బాబు అన్నారు. ఉద్యోగుల్లో విబేధాలు సృష్టిస్తున్న నేతలను ఏపీఎన్జీఓ నుంచి బహిష్కరిస్తామని అశోక్ బాబు చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: