మెదక్ లోక్ సభ ఉప ఎన్నికల బరిలో తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ భార్య పద్మిని రెడ్డి రంగంలోకి వచ్చారు.దామోదర కూడా ఆసక్తితో ఉన్నప్పట్టికీ, గత శాసనసభ ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయి ఉన్నందున తన బదులు , తన భార్యకు టిక్కెట్ ఇస్తే కూడా సిద్దమేనని ఆయన కాంగ్రెస్ అదిష్టానానికి సిద్దమని తెలియచేవారు.పద్మిని రెడ్డి గత కొన్ని నెలలుగా రాజకీయాలలో క్రియాశీలకంగా ఉన్నారు. సంగారెడ్డి నుంచి టిక్కెట్ ఆశించినా, విప్ జగ్గారెడ్డి అభ్యర్దిగా ఉన్నందున సాధ్యపడలేదు. ఇప్పుడు మెదక్ లోక్ సభ ఉప ఎన్నికలోతన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆమె భావిస్తున్నారు.ఇప్పటికే పలువురి పేర్లు తెరపైకి రాగా తాజాగా పద్మిని రెడ్డి రంగంలోకి రావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: