తెలంగాణ రాష్ట్రంలో దశల వారీగా రుణమాఫీ అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రుణమాఫీ విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆమోదం తెలిపారు. ఈ అంశంపై మంత్రులతో కేసీఆర్ సోమవారం సమావేశమయ్యారు. తొలిదశ రుణమాఫీ అమలు కోసం నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖకు కేసీఆర్ సూచించారు. అలాగే అసెంబ్లీ కమిటీల నియామకం గురించి కూడా మంత్రులతో కేసీఆర్ చర్చించారు. త్వరలోనే అసెంబ్లీ కమిటీలు ఏర్పాటుచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: