తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం అనేది కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల ఫలితమే అని అంటున్నాడు ఎర్రబెల్లి దయాకర్ రావు. ఏ కాంగ్రెస్ పార్టీ నేతనో ఈ విధంగా మాట్లాడి ఉంటే అది వేరే కథ! అయితే ఒక తెలుగుదేశం నేత ఈ విధంగా మాట్లాడటం తెలంగాణ వరకూ ఓకేనేమో కానీ.. ఇదే మాటలను ఏపీకి కూడా వర్తింపజేసి చూస్తే.. టీడీపీ కే ఇబ్బంది! తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినది కాంగ్రెస్ పార్టీ తప్పిదాల వల్లనే అనుకొంటే.. ఏపీలో తెలుగుదేశం అధికారంలోకి ఎలా వచ్చింది? అది కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్ల జరిగినదే అవుతుంది కదా! అంటే దాన్ని బట్టి చూస్తే ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అనేది చంద్రబాబు గొప్పదనం వల్ల కాదు, కాంగ్రెస్ విధానాల ఫలితం వల్లనే అది జరిగిందని అనుకోవాల్సి వస్తుంది! అలాగే తెలంగాణలో తాము పాండవులం అని ఎర్రబెల్లి చెప్పుకొచ్చాడు. తమకు వనవాసం నడుస్తోందని ఈయన అంటున్నాడు. మరి ప్రతిపక్షంలో ఉన్నవాళ్లంతా ఇలా పాండవులం అనుకొంటే.. వనవాసంలో ఉన్నమని అంటే... ఏపీలో తెలుగుదేశం పార్టీ కౌరవులకు ప్రతిరూపం అవుతుంది. మొత్తానికి ఈ విధఃగా ఒక రాష్ట్రంలోఅధికారంలో, మరో రాష్ట్రం ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఏం మాట్లాడినా అందులో మరో కోణాన్ని వెదుక్కోవచ్చు!

మరింత సమాచారం తెలుసుకోండి: