కేంద్ర మాజీ మంత్రి ,సీనియర్ కాంగ్రెస్ నేత జి.వెంకటస్వామి కన్నుమూశారు.ఎనబై ఐదేళ్ల వయసులో సుదీర్ఘ అనారోగ్యం తర్వాత ఆయన మరణించారు. ఏడుసార్లు లోక్ సభకు ఎన్నికై కేంద్రంలో మంత్రిగా కూడా పదవి నిర్వహించారు.ఒకసారి శాసనసభకు , మరో సారి శాసనమండలికి ఎన్నికయ్యారు. శాసనమండలికి ఎన్నికైనప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన నిరంతరం తపించారు. చెన్నారెడ్డితో కలిపి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా, అప్పటి టిపిఎస్ తరపు లోక్ సభకు కూడా ఎన్నికయ్యారు.ఆ తర్వాత కాంగ్రెస్ లో కలిసిపోయారు.పివి హయాంలో కూడా మంత్రిగా పనిచేశారు.వెంకటస్వామి మరణానికి ముఖ్యమంత్రి కెసిఆర్ తదితరులు సంతాపం ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: