భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలోవున్న అండర్ వరల్డ్‌డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీ ఎట్టకేలకు కనుగొన్నారు. పాకిస్థాన్లోని కరాచీ నగర శివారు ప్రాంతమైన క్లిఫ్టన్ నుంచి ఆయన ఫోన్లో మాట్లాడిన మాటలను వెస్ట్రన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రికార్డు చేసింది. దుబాయ్లో ఉంటున్న ఓ వ్యక్తితో ఆస్తి ఒప్పందానికి సంబంధించి దావూద్ మాట్లాడినట్లు ఆ సంస్థ తెలిపింది. రెండు దశాబ్దాల క్రితం పాకిస్థాన్‌కు పారిపోయిన దావూద్ ఆచూకీని కనుగొనేందుకు భారత నిఘా వర్గాలు తీవ్రంగా ప్రయత్నాలు చేసిన విషయం తెల్సిందే! ఈ ఏడాది మొదట్లో దావూద్ను అంతం చేసే అవకాశం భారత్కు వచ్చినట్టు తొలుత వార్తలు వెలువడ్డాయి. కమెండోలు దావూద్‌ను టార్గెట్ చేసినపుడు, కొన్ని నిమిషాలకు ముందు భారత్కు చెందిన ఓ వ్యక్తి ఫోన్ చేసి కాల్చొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం సాగిన విషయం విధితమే!

మరింత సమాచారం తెలుసుకోండి: