అమరావతి శంకుస్థాపన అనేది ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా.. పచ్చపార్టీ కార్యక్రమంగా చంద్రబాబునాయుడు ఎన్నడో మార్చేశారు. మట్టి నీరు వంటి పనులన్నీ పార్టీ పరంగా తెదేపా వారికి అప్పగించాడే తప్ప.. ప్రభుత్వ పని లాగా అనిన రాజకీయ పక్షాలకు అప్పగించలేదు. చివరికి ఇప్పుడు ప్రచార పర్వం విషయం వచ్చేసరికి.. పార్టీ కార్యక్రమం కంటె దారుణంగా ఇదంతా తన ఫ్యామిలీ మ్యాటర్ అన్నట్లుగా చంద్రబాబు కలరింగ్ ఇచ్చేయడం విశేషం.

అమరావతి శంకుస్థాపన 


తెలుగు సినిమా చరిత్రలో సంచలన విజయం సాధించిన పోకిరిలో ఒక డైలాగుంది. ప్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తుందా నాన్నా అంటూ మహేష్ హీరోయినా తమ్ముడితో జోక్ చేస్తాడు. ప్రస్తుతం చంద్రబాబు ప్యామిలీకి కూడా ఆ గతే పట్టింది కాబోలు. రాష్ట్రంలోని ప్రజల జీవన్మరణ సమస్యలన్నింటినీ తుంగలో తొక్కి నెలరోజులుగా అమరావతి శంకుస్థాపనపై చంద్రబాబు ఆయన తైనాతీలు చేస్తూ వస్తున్న రొడ్డకొట్టుడు ప్రచార యావ ఇప్పుడు బాబు కుటుంబానికి కూడా ఆవహించినట్లుంది.

అమరావతి రాజధానిని ప్రమోట్ చేయడానికి చంద్రబాబుతోపాటు ఆయన ఫ్యామిలీ మొత్తంగా రంగంలోకి దిగిపోయింది. చివరకు ఆరునెలల పసికందైన మనవడిని సైతం బాబు ముగ్గులోకి దింపటం దారుణమని విమర్శకులు తూర్పారబెడుతున్నారు. ట్విట్టర్‌లో బాబు ఫ్యామిలీ మొత్తంగా అమరావతి బ్రాండ్ ప్రచారంలోకి దిగిపోవడం సోషల్ మీడియాను గంగవెర్రులెత్తిస్తోంది. మన అమరావతి, మన రాజధాని అని రాసి ఉన్న ఒక పలకను చంద్రబాబు పట్టుకుని ఉన్నట్లు తీసిన ఫొటో సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లలో ఇప్పుడు హల్ చల్ సృష్టిస్తోంది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్ బాబు, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ కూడా బాబును అనుసరించడం గమనార్హం.

అమరావతి పేరుతో నడుస్తున్న భారీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇంత ప్రచార యావకు బాబు కుటుంబం మొత్తంగా దిగిపోవడంపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: