ప్రపంచంలో ఉగ్రవాదుల దాడి మరీ మితిమీరి పోతున్నాయి..అందమైన నగరం ప్యారిస్ దాడులకు పాల్పడి దాదాపు 150 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఇప్పటికే విరి అరాచకాల వల్ల అరబ్ దేశాలు వణికిపోతున్నాయి. వీరి టార్గెట్ లో ప్రపంచ అగ్ర దేశాలు ఉన్నట్లు ఇంటలీజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ ను మానవ బాంబులతో చంపేస్తామని మా నుంచి వారిద్దరు తప్పించుకునే ప్రసక్తేలేదని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. 6 నిమిషాల నిడివి గల ఈ వీడియోను ఇరాక్లో రూపొందించారు.  

వైట్ హౌస్ ను అత్యాధునిక బాంబులతో, కారు బాంబులతో పేల్చేస్తామని బెదిరించాడు. ఆ వెంటనే మరో ఉగ్రవాది మాట్లాడుతూ ఒరాక్ ఒబామా, హోలాండ్ ఎక్కడికి వెళ్లినా మా అనుచురులు వెంబడిస్తారని, మానవ బాంబులతో వారిద్దరిని అంతం చేస్తామని హెచ్చరించాడు.  మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని కట్టుదిట్టాలు తీసుకున్నా వదిలే సమస్యే లేదు అని హెచ్చరించారు. ప్యారిస్ లో ఏ విదంగా దాడులు చేశామో అదే విదంగా అమెరికాలో దాడులు చేస్తామని పారిస్ బిఫోర్ రోమ్ అనే పేరుతో ఆరు నిమిషాల వీడియోను విడుదల చేశారు. ఇరాక్ లో ఈ వీడియో రూపోందిందని అధికారులు తెలిపారు. అయితే ప్యారిస్ తరహాదాడులు అమెరికాలో జరిగే అవకాశం లేదని ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమి స్పష్టం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: