సార్వత్రిక ఎన్నికలు తలదన్నేలా ఎంతో ఉత్కంఠగా సాగిన వరంగల్ ఉప ఎన్నికలు టీఆర్ఎస్ విజయం సాధించింది. అంతే కాదు పోటీపడ్డ టీడీపీ,కాంగ్రెస్,వైసీపీలకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇక ఇప్పుడు ఆయా పార్టీల్లో లోటు పాట్ల గురించి ఎక్కడ వైఫల్యం జరిగిందీ అన్న అంశంపై చర్చలు మొదలు అయ్యాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత దయాకర్ రావు పోటీలో నిలబడ్డ వ్యక్తి కీలకమైన వ్యక్తి కాదని తమలాంటి సీనీయర్ నేతలు ఎన్నికల్లో పోటీ పడితే టీఆర్ఎస్ కి తెలిసి వచ్చేదని వ్యాఖ్యానించారు.

తాజాగా ఎన్నికల ఫలితాలపై సీనియర్ కాంగ్రెస్ నాయకులు శంకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వీ హనుమంత రావు తర్వాత ఆ రేంజ్ లో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో శంకర్రావు అందవేసిన చెయ్యి. ఈయన వ్యాఖ్యలు ఎప్పుడూ కాంట్రవర్సీగానే ఉంటాయి.  ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికల్లో పార్టీ ఓడి పోవడంపై కూడా అలాంటి వ్యాఖ్యలే చేసి పార్టీ నేతలు సైతం విస్తుపోయేలా చేశారు.

వరంగల్ ఉప ఎన్నికల్లో ఓడిపోయింది అభ్యర్ధి సర్వే నారాయణ అంతేకానీ పార్టీ కాదు అని వ్యాఖ్యానించారు. సర్వే లోకల్ క్యాండిడేట్ కానందువల్లే ఓడిపోయారని అన్నారు. మొత్తానికి శంకర్రావు ఓటమికి కొత్త అర్ధాన్ని చెప్పారు.ఇచ్చిన సోనియమ్మకు గుడి కడతానని హడావుడి చేసిన శంకర్రావు ఇప్పుడు ఆ సంగతి మర్చిపోయినట్టు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: