భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆ కుర్రాన్ని భలే ఆటపట్టించారు..సరదాగా చెవి పట్టుకొని చమత్కారం చేశారు. సాక్షాత్తూ ప్రధాన మంత్రి గారే ఆ కుర్రోడి చెవిపట్టి చమత్కరించారంటే ఇంతకీ ఆ కుర్రోడు ఎవరా అనుకుంటున్నారా..మరెవరో కాదు బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కొడుకు అర్నవ్. విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ ప్లీట్ రివ్యూను ఏపి ప్రభుత్వం గ్రాండ్‌గా జరుపుతుండగా, ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి, నరేంద్ర మోడి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఇంక ప్లీట్ రివ్యూకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన కుమారుడు ఆర్నవ్‌ని వెంటబెట్టుకొని వచ్చారు. త్రివిధ దళాల అధిపతి హోదాలో రాష్ట్రపతి ఈ సమీక్ష చేశారు. సంప్రదాయబద్ధమైన 21 తుపాకులతో గౌరవ వందనం స్వీకరించిన తరువాత రాష్ట్రపతి యుద్ధనౌక ఐఎన్‌ఎస్ సుమిత్రను అధిరోహించారు. అందులో పయనిస్తూ సముద్రజలాల్లో లంగరు వేసి ఉన్న 100 యుద్ధ నౌకల సామర్థ్యాన్ని సమీక్షించారు. వాటిలో భారత యుద్ధ నౌకలు 71 కాగా మిగిలినవి విదేశీ యుద్ధ నౌక లు. ఐఎన్‌ఎస్ సుమిత్ర తమ చెంతకు రాగానే యుద్ధ నౌకల్లో ఉన్న నౌకాదళాల అధికారులు, సిబ్బంది రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు.

విశాఖలో నేవీడే 


ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సరదాగా తన కుమారుడు ఆర్నవ్ చెవి పట్టుకొని మంచి బాలుడు అని అనడం తండ్రిగా గర్వపడే విషయమని నటుడు అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. మోదీ, ఆర్నవ్ చెవిని పట్టుకొన్న ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. తనకు కూడా ఇది మరచిపోలేని సంఘటన అని, వేల పదాలకుండే విలువ నిజంగా ఈ దృశ్యానికుందని తల్లి ట్వింకిల్ కన్నా ట్విట్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: