ఇద్దరు డాక్టర్ల మద్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానైంది..అదికాస్త కాల్పులు జరుపుకునే పరిస్థితికి వచ్చింది. హైదరాబాద్  హిమయత్ నగర్‌లో కాల్పుల కలకలం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.  హిమయత్ నగర్ రాజా రెసిడెన్సీలో ఈరోజు జరిగిన గ్లోరియట్ ఆసుపత్రి డైరెక్టర్ల సమావేశ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. నగరంలోని హిమాయత్ నగర్ 6వ నంబర్ వీధిలోని రాజా రెసిడెన్సీలో గ్లోరియట్ డాక్టర్ల సమావేశం జరిగింది.


అయితే ఈ ముగ్గరు డాక్టర్ ఒకే కారులో ప్రయాణించారు. అప్పటికే కోపంగా ఉన్న డాక్టర్ శశికుమార్ తన వద్ద ఉన్న తుపాకీతో డాక్టర్ ఉదయ్‌పై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో మరో డాక్టర్ కూడా కాల్పులు జరిపాడు..ఆ గన్ శబ్ధాలు విన జనం అటూ ఇటూ పరుగులు తీశారు. 


ఇద్దరు డాక్టర్లను సమీపంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కాల్పుల్లో గాయపడ్డ డాక్టర్ ఉదయ్ పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందించిన వైద్యులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: