గ్రేటర్ ఎలక్షన్ లు పూర్తయ్యి వారాలు దాటుతున్నా కూడా కెసిఆర్ ఇంకా టీడీపీ కి చుక్కలు చూపించడం ఇంకా ఆపలేదు. గ్రేటర్ లలో టీడీపీ ని ఇప్పట్లో కోలుకోలేని దెబ్బ తీసిన కెసిఆర్. అవి పూర్తయిన తరవాత కూడా టీడీపీ ఎమ్మెల్యే లని ఆకర్షణ మంత్రం తో తన పార్టీలోకి లాక్కుని దారుణమైన దెబ్బ తీసారు. ఈ గ్యాప్ లో కాంగ్రెస్ జనాలు రెచ్చిపోతున్నారు.టీడీపీ నేతలు తెరాస లోకి వెళ్లి అక్కడ ఎగస్ట్రా లగేజీ అవ్వడం తప్ప మరేమీ ఉండదు అనీ కావాలంటే కాంగ్రెస్ లోకి వచ్చి తమ సత్తా చాటుకోవాలనీ ఆయన అంటున్నారు.

 

                                                     

ఈ మధ్య కాలం లో ఇదే పెద్ద జోక్ కాబోలు. తెరాస వారు టీడీపీ ని చావు దెబ్బ కొట్టినట్టే కాంగ్రెస్ ని కూడా కొడుతున్నారు కాకపోతే కాస్త గ్యాప్ ఇచ్చారు అంటే. కాంగ్రెస్ నేత జనా రెడ్డి తెరాస కోవర్ట్ గా కాంగ్రెస్ లో పని చేస్తున్నారు అని అందరికీ తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల సమయం లో తెరాస కి అనుకూలంగా జానారెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రెస్ ని ఎలా దెబ్బ తీసాయో తెలిసిందే.

 

 

 

ప్రస్తుతం టీడీపీ లో బాంబ్ పెట్టిన తెరాస , నారాయణఖేడ్ ఎన్నికల తరవాత కాంగ్రెస్ కి చుక్కలు చూపించబోతోంది అని టాక్ నడుస్తోంది . మొత్తం మీద తెలంగాణా లో విపక్షం ప్రతిపక్షం ఇలా ఏ పక్షాలూ లేకుండా చెయ్యాలి అనేది తెరాస వ్యూహం. ఆ సునామీ లో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా మినహాయింపు లేకుండా కొట్టుకుని పోవాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: