సినిమా ఇండస్ట్రీలో తొంబైవ శతాబ్ధంలో తమ అందాలతో హాట్ బీట్ సృష్టించిన తారలు ఖష్బు,నగ్మా. తర్వాత ఈ ఇద్దరు సెంకండ్ ఇన్నింగ్స్ ప్రారంబించినా అందులో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు. తర్వాత ఈ ఇద్దరు రాజకీయ రంగంలోకి ప్రవేశించారు.ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి..ఈ నేపథ్యంలో ఇద్దరు భామలు ఎన్నికల్లో నిలబడాలని నిశ్చయించారు.

ఆ మద్య కాంగ్రెస్ తరుపు నుంచి నటి ఖష్బుకి టికెట్ రావడం ఖాయం.. అనగానే   మైలాపూర్ నియోజకవర్గం నుంచి ప్రయత్నాలు చేశారు ఖుష్బు కానీ అది ఫలించలేదు. కాంగ్రెస్ అదిష్టానాన్ని కలిసి టిక్కెట్ కోరడం, గతంలో విబేదించి డి.ఎమ్.కె. నుంచి బయటకు వచ్చినా, మళ్లీ కరుణానిధి ని కలిసి ఆశీస్సులు అడగడం ఇలా పలు విధాలుగా ఆమె టిక్కెట్ కోసం తంటాలు పడ్డారు.

అంతే కాదు ఖుష్బు ఏకంగా ముఖ్యమంత్రి జయలలితపై పోటీ చేయబోతుందన్న ప్రచారం కూడా జరిగింది. అంతా సవ్యంగా జరుగుతుందన్న సమయంలో ఖుష్బు,నగ్మాలకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చింది. మైలాపూర్ స్థానాన్ని కరాటే త్యాగరాజన్ కు ఇవ్వడం తో వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: