ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయానికి ఎంతో పేరుంది. ఇక్కడ ఈరోజు జరిగేదాన్ని రేపు భారత్ అనుసరిస్తుంది అని ఓ నానుడి కూడా ఉంది. ఇదే యూనివర్శిటీ నుంచి చదువుకున్నవారెందరో ప్రముఖ నాయకులు, వివిధ రంగాల్లో ప్రసిద్ధులు అయ్యారు. ఐతే. ఇదంతా నాణానికి ఒక వైపు మాత్రమే అంటున్నారు అక్కడి అధ్యాపకులే. 

జేఎన్‌యూ వ్యవస్థీకృత సెక్స్‌ రాకెట్‌కు అడ్డాగా మారిందని యూనివర్శిటీ ప్రోఫెసర్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు ఏకంగా ఈ సెక్స్ రాసలీలలపై ఓ భారీ నివేదికే రూపొందించారు. జేఎన్‌యూ- వేర్పాటువాదం, ఉగ్రవాదానికి అడ్డా పేరుతో దాదాపు 200 పేజీలతో ఉదాహరణలతో సహా వివరించారు సదరు ప్రోఫెసర్లు.

జేఎన్ యూ బ్రోతల్ హౌజ్ గా మారిపోయిందా..!?



మొత్తం  11 మంది జేఎన్‌యూ ప్రొఫెసర్లు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. వాస్తవానికి ఈ నివేదికను గత ఏడాదే రూపొందించారు. కానీ ఇటీవలే కొద్దిమంది పాత్రికేయులకు మాత్రమే ఈ ప్రతులు విడుదల చేశారు. ఈ ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ యూనివర్శిటీ విద్యార్థి నాయకుడైన కన్నయ్య కూడా విశ్వవిద్యాలయంలో స్వేఛ్చ గురించి మాట్లాడుతూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. 

రేపు వాళ్లు మన హాస్టల్ రూముల్లోని డస్ట్ బిన్లలో ఉన్న కండోమ్ ప్యాకెట్లు కూడా లెక్కపెడతారేమో.. అని కన్నయ్య ఓ సందర్భంలో అన్నాడు. ఇప్పుడు ఈ ప్రొఫెసర్ల నివేదిక చూస్తే అదే నిజమేమో అనిపిస్తోంది. ఐతే.. ఇదంతా బీజేపీ అనుకూల ప్రొఫెసర్ల కుట్ర అనే వాదన కూడా లేకపోలేదు. ఇప్పుడు నివేదిక రూపొందించిన 11 మంది ప్రొఫెసర్లు కూడా బీజేపీ, ఏబీవీపీ సన్నిహిత వర్గాలేని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: