రోజా.. ఈ మధ్యకాలంలో ఇంతగా కాంట్రావర్సీ అయిన మహిళా నేత తెలుగు రాష్ట్రాల్లో లేరనే చెప్పాలి. ఏపీ అసెంబ్లీలో తన ప్రవర్తన కారణంగా ఆమె ఏడాది పాటు సస్పెండ్ అయ్యారు. దానిపై ఆమె న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. రోజా ముఖ్యమంత్రిని సైతం కామ ముఖ్యమంత్రి అనడం, మిగిలిన ఎమ్మెల్యేలను సైతం తూలనాడటం కెమేరాల సాక్షిగా కనిపించింది. 

ఐతే.. రోజా వాదన మరోలా ఉంది. తన వీడియోలు మాత్రమే విడుదల చేశారని.. మొత్తం ఫుటేజ్ చూపితే ఎవరి తప్పో తేలిపోతుందని ఆమె గతంలో చాలాసార్లు అన్నారు. విచిత్రం ఏంటంటే.. ఇంత జరిగిన తర్వాత కూడా రోజా తీరు మాత్రం అదే తరహాలో కొనసాగుతోంది. ఏపీ సీఎం తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్సి లోకేశ్ పై ఆమె తాజాగా కాంట్రావర్సీ కామెంట్ చేశారు. 

పొగరు.. వగరు తగ్గని రోజా..!

చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ను పప్పుసుద్ద అంటూ తీసిపారేసింది వైసీపీ ఎమ్మెల్యే రోజా. తమ నాయకుడు జగన్ ను.. దమ్ముంటే తన అవినీతి నిరూపించాలని లోకేశ్ సవాల్ విసరడం ఆమెకు కోపం తెప్పించింది. గతంలో లోకేష్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆఱ్ పై కూడా సవాలు చేసి.. ఆ తర్వాత పారిపోయారని రోజా ఎద్దేవా చేసింది. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని ఈ పప్పుని ముఖ్యమంత్రిని చేయడానికే సీఎం ఎమ్మెల్యలను కొంటున్నారని విమర్శించింది రోజా. 

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను, ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారని రోజా మండిపడ్డారు. చంద్రబాబునాయుడు తప్పు చేయకపోతే తాము చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్దమా అని రోజా సవాల్ విసిరారు. విజయమ్మ గతంలో వేసిన పిటిషన్ లో ఉన్న అంశాలపై విచారణకు సిద్దమా అని రోజా ప్రశ్నించారు. చీకట్లో చిదంబరం కాళ్లు పట్టింది వాస్తవం కాదా అని రోజా విమర్శించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: