తెలంగాణా ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు దత్త పుత్రిక ప్రత్యూష ప్రేమ ఉదంతం రోజు రోజుకీ ఒక కీలక మలుపు తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు కొత్తగా మరొక ఆసక్తికర మలుపు తిరిగింది ఈ ప్రేమ కథ. సవతి తల్లి, తండ్రి చేతుల్లో దారుణమైన హింస కి గురైన ప్రత్యూష కెసిఆర్ కి దత్త పుత్రికగా మారి వారి ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. కన్నా తండ్రి , సవతి తల్లి పెట్టిన చిత్ర హింసల వలన ఆమె తీవ్ర గాయాల పాలు అవగా కెసిఆర్ స్వయంగా ఆసుపత్రి లో జేర్పించి అక్కడ నుంచి మెరుగైన వైద్యం అందిన తరవాత తన ఇంటికి తీసుకుని వెళ్ళారు.



ఆమె సంరక్షణ బాధ్యతలు తనవే అని కెసిఆర్ అప్పుడే ప్రకటించారు. అయితే ఆమె ఇప్పుడు కొత్తగా ఆళ్ళ గడ్డ కి చెందిన ఒక కుర్రాడు వెంకట మద్దిలేటి రెడ్డి తో ప్రేమలో ఉంది . అతన్నే తాను పెళ్లి చేసుకుంటా అంటూ ఆమె మనసులో మాట చెబుతోంది. ఈమె ప్రస్తుతం ఇంటర్ పూర్తి చేసింది బీఎస్సీ నర్సింగ్ కి వెళ్ళబోతూ ఉండగా పెళ్లి చేసుకోవాలనే కోరిక ఆమెకి సడన్ గా కలిగింది. అతన్ని పెళ్లి చేసుకున్న తరవాత తాను చదువుకుంటాను అని కోర్టు లో విన్నవించుకుంది ఆమె. ఈ విషయం మీద కోర్టు కి వెల్లడం సంచలనం సృష్టిస్తోంది. ఆళ్ళ గడ్డ లో ఆటో మొబైల్ షాపు స్టోర్ కీపర్ గా పని చేస్తున్న అతను ఆమెకి ఆసుపత్రిలో ఉండగా పరిచయం అట.

మరింత సమాచారం తెలుసుకోండి: