తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరబాద్ ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చెబుతుంది..అయితే హైదరాబాద్ నగరం ఎంతగా విస్తరిస్తుంటే..నేర సామ్రాజ్యం కూడా అదే రీతిలో విస్తరిస్తుంది. డ్రగ్స్, అక్రమ ఆయుధాలు, హైటెక్ వ్యభిచారాలు, కిడ్నాపింగ్,చైన్ స్నాచింగ్ లతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక మహిళలపై అఘాయిత్యాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి..తాజాగా  హైదరాబాద్‌ నగరంలో అదృశ్యమైన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైంది. లింగంపల్లిలోని రైల్వే ట్రాక్ వద్ద హష్మీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

ఈ మేరకు ఆ టెక్కీ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తలబై బండరాయితో మోది అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.  కాగా హష్మీ అదృశ్యంపై కుటుంబ సభ్యులు మంగళవారం గచ్చిబౌలి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.దీనిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంతలో నగర శివారులోని లింగంపల్లి రైల్వే ట్రాక్ వద్ద పడి ఉన్న మహిళ మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా, ఆ మృతదేహం మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హష్మిగా గుర్తించారు.

హష్మిని దుండగులు అతి దారుణంగా కొట్టి బండరాళ్లతో మోది చంపారు. అంతే కాదు హస్మి వద్ద రూ. 10 వేలు, బంగారు గొలుసును లాక్కెళ్లిపోయారు. బల్కంపేటలో హస్మి ఇంటి పక్కగదిలోని వ్యక్తే హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: