తమిళనాడులో సినిమా హీరోలకు, రాజకీయ నాయకులకు అభిమానులు చాలా మంది ఉంటారు..అందులో మరీ శృతిమించి అభిమానించే అభిమానులు కూడా చాలా మాంది ఉంటారు. ఆ మద్య తమిళనాడులో జయలలిత మరోసారి గెలవాలని ముఖ్యమంత్రి పదవి అలంకరించాలని ఓ యువకుడు తన చిటికన వేలు దేవుడికి సమర్పించాడు. ఇప్పుడు కొంతమంది అమ్మ అభిమానులు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జయలలిత మీద అభిమానంతో అమ్మ అభిమానులు చేపట్టిన గుండు కార్యక్రమం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో 134 స్థానాల్లో అమ్మ పార్టీ అయిన అన్నాడీఎంకే గెలవటంతో.. ఆ గుర్తుగా 134 మంది పార్టీ కార్యకర్తలు  గుండు కొట్టించుకున్నారు. గుండు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న వారు.. ఆ ఆనందాన్ని అమ్మతో పంచుకోవటానికి అమ్మ ఇంటికి వెళ్లారు.  ఇక ట్విస్ట్ ఏంటంటే అంతగా గుండు చేసుకొని అమ్మ మెప్పు పొందాలని వచ్చిన ఆ అభిమానులను కలుసుకోవటానికి అమ్మ ఆసక్తి ప్రదర్శించలేదు.

అయితే జయలలిత మాత్రం వారిని కలవడానికి ఇష్టపడని కారణం వేరే ఉందట..న మీద అభిమానంతో ఇలా గుండు కొట్టించుకున్న వారిని కలిసి.. సంతోషాన్ని వ్యక్తం చేస్తే..ఇలా చాలా మంది గుండు కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతారని భావించినట్లు ఆమె అనుచర బృందం అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: